Akshay Kumar IPL 2022 : ఐపీఎల్ ఫైన‌ల్ లో అక్ష‌య్ హ‌ల్ చ‌ల్

మోదీ స్టేడియంలో న‌టీ న‌టుల సంద‌డి

Akshay Kumar IPL 2022 : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) 2022 ఫైన‌ల్ మ్యాచ్ ముగిసింది. విజేత‌గా గుజ‌రాత్ టైటాన్స్ నిలిచింది. వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

ఇంకో వైపు తార‌ల త‌ళుకు బెళుకుల‌తో అహ్మ‌దాబాద్ లోని మోదీ మైదానం సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది. ప్ర‌ధానంగా బాలీవుడ్ కు చెందిన

స్టార్లు హ‌ల్ చ‌ల్ చేశారు.

ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా ఆస్కార్ అవార్డు గ్ర‌హీత‌, సంగీత దిగ్గ‌జం అల్లా ర‌ఖా రెహ‌మాన్ సార‌థ్యంలో సంగీత క‌చేరి సాగింది. స్టార్ హీరోలు

ర‌ణ్ వీర్ క‌పూర్ , అక్ష‌య్ కుమార్(Akshay Kumar IPL 2022)  ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారారు.

ఏకంగా ల‌క్ష‌కు పైగా ప్రేక్ష‌కులు హాజ‌ర‌య్యారు ఈ ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ చూసేందుకు. ఇది ఓ రికార్డు కూడా. ఈ సంద‌ర్భంగా స్టేడియంలో ఉన్న వారంద‌రికీ అభివాదం చేశారు ఈ స్టార్ హీరో. ఇప్పుడు ఆయ‌న ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైర‌ల్ గా మారాయి.

అక్ష‌య్ కుమార్ కు క్రికెట్ అంటే అభిమానం. అంతే కాదు భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి ఆయ‌న గ‌ట్టి మ‌ద్ద‌తుదారుగా ఉన్నారు. ఎన్నో

సార్లు ప్ర‌ధానిని ఇంట‌ర్యూ కూడా చేశారు.

ఆ మ‌ధ్య‌న రైతుల ఉద్య‌మం గురించి చేసిన కామెంట్స్ అక్ష‌య్ కుమార్(Akshay Kumar IPL 2022) ను తీవ్ర ఇబ్బందికి గుర‌య్యేలా చేసింది.

దీంతో త‌న త‌ప్పు తెలుసుకుని క్ష‌మాప‌ణ‌లు కోరాడు రైతుల‌ను. ప్ర‌త్యేకించి ఫైన‌ల్ మ్యాచ్ చూసేందుకు అహ్మ‌దాబాద్ కు వ‌చ్చాడు అక్ష‌య్.

అభిమానులు పెద్ద ఎత్తున అత‌డికి స్వాగతం ప‌లికారు. అభిమానులు అక్ష‌య్(Akshay Kumar IPL 2022) తో క‌ర‌చాల‌నం చేసేందుకు, సెల్ఫీలు దిగేందుకు పోటీ ప‌డ్డారు. ర‌ణ్ వీర్ సింగ్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఈ ఫైన‌ల్ మ్యాచ్ ప్రారంభమైంది.

రెహ‌మాన్ కు మోహిత్ చౌహాన్ , న‌తి మోహ‌న్ లతో పాటు చాలా మంది గాయ‌కులు పార్టిసిపేట్ చేశారు.

Also Read : ఐపీఎల్ 2022 అవార్డులు విజేత‌లు

Leave A Reply

Your Email Id will not be published!