16 Captains One Frame : ఒకే ఫ్రేమ్ లో 16 మంది కెప్టెన్లు

సోష‌ల్ మీడియాలో వైర‌ల్

16 Captains One Frame : ప్ర‌పంచ క్రికెట్ సంబురానికి వేదిక కానుంది ఆస్ట్రేలియా. అక్టోబ‌ర్ 16 నుంచి అస‌లైన స‌మ‌రానికి స‌న్నద్దం కానుంది. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వ‌ర్యంలో టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ప్రారంభం కానుంది. ఈ సంద‌ర్భంగా వ‌ర‌ల్డ్ క‌ప్ లో 16 జ‌ట్లు పాల్గొంటున్నాయి. ఇందుకు సంబంధించి ఆయా జ‌ట్ల కెప్టెన్లు ఒకే చోట(16 Captains One Frame) ఫోటో దిగారు.

ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఆట ప‌రంగా చూస్తే క్వాలిఫ‌య‌ర్స్ లో న‌మీబియాతో శ్రీ‌లంక జ‌ట్టు త‌ల‌ప‌డ‌డంతో టి20 మెగా టోర్నీ స్టార్ట్ అవుతుంది. జ‌ట్ల నాయ‌కులంతా కెప్టెన్స్ డేకి హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా కేక్స్ క‌ట్ చేశారు. ఈ అరుదైన ఫోటోను ఐసీసీ షేర్ చేసింది.

అక్టోబ‌ర్ 22న న్యూజిలాండ్ తో ఆస్ట్రేలియా ఆడ‌డంతో సూప‌ర్ 12 ద‌శ ప్రారంభం అవుతుంది. అక్టోబ‌ర్ 23న చిర‌కాల ప్ర‌త్య‌ర్థులుగా పేరొందిన భార‌త్, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తాయి. ఇక న‌వంబ‌ర్ 13న మెల్ బోర్న్ లో ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ కప్ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఆరోజే ప్ర‌పంచ విజేత ఎవ‌రో తేల‌నుంది.

1.6 మిలియ‌న్ల బ‌హుమ‌తి అందుకుంటుంది. మొత్తం ప్రైజ్ మ‌నీ యుఎస్ డాల‌ర్లు 5.6 మిలియ‌న్లు. ర‌న్న‌ర‌ప్ కి 8,00,000 డాల‌ర్లు, ఓడిపోయిన సెమీ ఫైన‌లిస్టుల‌కు భారీ మొత్తంగా ప్రైజ్ మ‌నీ అందుకుంటారు. 45 మ్యాచ్ లు జ‌రుగుతాయి. ఒక్కో జ‌ట్టుకు యుఎస్ డాల‌ర్లు 4,00,000 అందుకుంటారు.

ఆస్ట్రేలియాలోని ఏడు వేదిక‌ల‌లో ఈ మ్యాచ్ లు కొన‌సాగుతాయి. ఆఫ్గ‌నిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ , ఇండియా, న్యూజిలాండ్ , పాకిస్తాన్, ద‌క్షిణాఫ్రికా సూప‌ర్ 12లో త‌ల‌ప‌డ‌తాయి.

Also Read : నెట్టింట్లో కోహ్లీ గంగూలీ మీమ్స్ వైర‌ల్

Leave A Reply

Your Email Id will not be published!