Delhi Capitals 2022 : అంద‌రి క‌ళ్లు ఢిల్లీ క్యాపిట‌ల్స్ పైనే

ఐపీఎల్ లో స‌త్తా చాటేందుకు రెడీ

Delhi Capitals 2022 :  భార‌త స్టార్ ప్లేయ‌ర్ రిష‌బ్ పంత్ (Rishabh Pant) సార‌థ్యం వ‌హిస్తున్న ఐపీఎల్ (IPL) పైనే అంద‌రి క‌ళ్లు ఉన్నాయి. ఈసారి ముంబై వేదిక‌గా ఈనెల 26 నుంచి ఐపీఎల్ -2022 సీజ‌న్ 15 లీగ్ ప్రారంభం కానుంది.

మొత్తం 10 జ‌ట్లు పాల్గొన‌నున్నాయి. గ‌త నెల 12, 13 ల‌లో బెంగ‌ళూరు వేదిక‌గా జ‌రిగిన మెగా వేలంలో స్టార్ ఆట‌గాళ్ల‌ను ఓన్ చేసుకుంది ఢిల్లీ క్యాపిట‌ల్స్ (Delhi Capitals 2022) యాజ‌మాన్యం.

ఐపీఎల్ (IPL)  టైటిల్ రేసులో ఢిల్లీ క్యాపిట‌ల్స్ (Delhi Capitals 2022) జ‌ట్టు కూడా ఉండ‌డం విశేషం.

గ‌తంలో ఈ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించిన స్టార్ బ్యాట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ ఉన్న‌ట్టుండి పంజాబ్ కింగ్స్ కు మారాడు.

ఇక ఈ జ‌ట్టుకు ప్ర‌ముఖ దిగ్గ‌జ ఆసిస్ ఆట‌గాడు రికీ పాంటింగ్ కోచ్ గా ఉన్నాడు. పంత్ , పాంటింగ్ ల కాంబినేష‌న్ లో

గ‌త ఏడాది 2021 దుబాయి వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ (IPL) రిచ్ లీగ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ (Delhi Capitals 2022 ) అన్ని జ‌ట్ట‌కు చుక్క‌లు చూపించింది.

టైటిల్ గెలిచిన సీఎస్కే టీంకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించేలా చేసింది ఆ టీమ్.

ప్ర‌ధానంగా రిష‌బ్ పంత్ (Rishabh Pant) స్టార్ హిట్ట‌ర్ గా ఉన్నాడు. 2008లో ఢిల్లీ డేర్ డేవిల్స్ గా ప్రారంభించారు దీనిని.

ఈ జ‌ట్టు ఫ్రాంచైజీ ప్ర‌ముఖ వ్యాపార దిగ్గ‌జ సంస్థ జీఎంఆర్ గ్రూప్ , జేఎస్ డ‌బ్ల్యూ గ్రూపుల చేతుల్లో ఉంది.

ప్రపంచంలోనే పేరొందిన విమానాయ‌నాల నిర్వ‌హ‌ణ సంస్థ‌ల్లో

ఒక‌టిగా పేరొందింది గ్రంథి మ‌ల్లికార్జున రావు నేతృత్వంలోని జీఎంఆర్. కానీ ఎవ‌రికీ తెలియ‌ని విష‌యం ఏమిటంటే ఐపీఎల్ (IPL) లో ఆ సంస్థ ప్రాతినిధ్యం వ‌హిస్తుంద‌ని.

వ్యాపార‌స్తులు తాము సంపాదించిన దానిని స‌మాజ సేవ‌కు కాకుండా కోట్లు కొల్ల‌గొట్టేందుకు వీటిని ఉప‌యోగిస్తున్నారు. ఢిల్లీకి ప్రాతినిధ్యం వ‌హిస్తోంది ప్ర‌స్తుతం ఢిల్లీ క్యాపిటిల్స్.

విచిత్రం ఏమిటంటే పూర్ ప‌ర్ ఫార్మెన్స్ తో ఉన్న మాజీ కెప్టెన్ అజింక్యా ర‌హానేను ఓన చేసుకోవ‌డం విశేషం. జ‌ట్టు ప‌రంగా చూస్తే ఊహించ‌ని రీతిలో డేవిడ్ వార్న‌ర్ ను తీసుకుంది.

బ్యాట‌ర్ల ప‌రంగా చూస్తే వార్న‌ర్ , పావెల్, షా, య‌శ్ ధుల్ ఉన్నాడు. వికెట్ కీప‌ర్లు గా సీఫెర్ట్ , రిష‌బ్ పంత్ (Rishabh Pant) , కేఎస్ భ‌ర‌త్ ఆడ‌తారు.

ఆల్ రౌండ‌ర్లుగా మిచెల్ మార్ష్ , అక్ష‌ర్ ప‌టేల్ , విక్కీ , స‌ర్ఫ‌రాజ్ ఖాన్ , మ‌న్ దీప్ సింగ్ , రిపాల్ పటేల్ , హెబ్బార్ , ల‌లిత్ యాద‌వ్ ఆడ‌తారు.

బౌల‌ర్ల‌లో లుంగీ ఎంగిడి, అన్రిచ్ నార్టే, ముస్తాఫిజుర్ రెహ‌మాన్ , శార్దూల్ ఠాకూర్ , కుల్దీప్ యాద‌వ్ , ఖ‌లీల్ అహ్మ‌ద్ , చేత‌న్ స‌కారియా , ప్ర‌వీణ్ దూబే, క‌మ‌లేష్ నాగ‌ర్ కోటి ఆడ‌తారు.

Also Read : రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ర‌ఫ్ఫాడిస్తారా

Leave A Reply

Your Email Id will not be published!