Allu Arjun : పునీత్ ఫ్యామిలీని ప‌రామ‌ర్శించిన బ‌న్నీ

రాజ్ కుమార్ తో అనుబంధం చెప్ప‌లేను

Allu Arjun  : అన‌తి కాలంలోనే క‌న్న‌డ సినీ రంగంలో సూప‌ర్ స్టార్ గా ఎదిగి అనుకోకుండా త‌క్కువ వ‌య‌సులో ఇక సెల‌వంటూ వెళ్లి పోయిన పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని ఇవాళ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun )ప‌రామ‌ర్శించారు.

క‌రోనాతో పాటు షూటింగ్ బిజీ వ‌ల్ల ఆయ‌న క‌ల‌వ‌లేక పోయారు. అల్లు ఫ్యామిలీతో ద‌గ్గ‌రి అనుబంధం ఉంది పునీత్ , శివ‌రాజ్ కుమార్ ల‌కు. ఇవాళ బ‌న్నీ బెంగ‌ళూరు విమానాశ్ర‌యం నుంచి నేరుగా భారీ భ‌ద్ర‌త న‌డుమ పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లారు.

ఆయ‌న చిత్ర ప‌టానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. అనంత‌రం పునీత్ రాజ్ కుమార్ భార్య‌, అన్న శివ రాజ్ కుమార్ తో మాట్లాడారు.

ఈ దేశం గొప్ప న‌టుడిని కోల్పోయింద‌ని, ఆయ‌న మ‌ర‌ణాన్ని తాను త‌ట్టుకోలేక పోతున్నాన‌ని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. అక్క‌డి నుంచి అల్లు అర్జున్(Allu Arjun )నేరుగా పునీత్ స‌మాధి వ‌ద్ద‌కు చేరుకుని నివాళులు అర్పించారు.

ఇదిలా ఉండ‌గా గ‌త ఏడాది అక్టోబ‌ర్ లో అంద‌రినీ శోక‌సంద్రంలో ముంచెత్తుతూ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో అకాల మ‌ర‌ణం చెందారు. వేలాది మంది ఆయ‌న మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేక పోయారు.

టాలీవుడ్ దిగ్గ‌జాలంతా హాజ‌రై పునీత్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి ధైర్యం చెప్పారు. ఆయ‌న మృతికి నివాళులు అర్పించారు.

చిరంజీవి, వెంక‌టేశ్, రాజేంద్ర ప్ర‌సాద్, అలీ, బాల‌కృష్ణ‌, ద‌గ్గుబాటి రాణాతో పాటు త‌మిళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌భుదేవా, శ‌ర‌త్ కుమార్ సైతం హాజ‌ర‌య్యారు.

ఇదే స‌మ‌యంలో ఆస్ప‌త్రిలో ఉన్న దిగ్గ‌జ న‌టుడు ర‌జ‌నీకాంత్ పునీత్ ను మ‌రిచి పోలేక పోతున్నాన‌ని వాపోయాడు.

Also Read : మ‌ణిర‌త్నంకు అరుదైన పుర‌స్కారం

Leave A Reply

Your Email Id will not be published!