Anant-Radhika Wedding : అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ల పెళ్లి పై కీలక అప్డేట్

అదేంటంటే నిరుపేద ప్రజల కోసం సామూహిక వివాహాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు...

Anant-Radhika : ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహం జూలై 12న జరగనుంది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ పెళ్లి వేడుకను నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ వేడుక గురించి చాలా రోజులుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ వేడుకకు ముందు అంబానీ ఫ్యామిలీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Anant-Radhika Wedding Updates

అదేంటంటే నిరుపేద ప్రజల కోసం సామూహిక వివాహాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ కార్డ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని బట్టి చూస్తుంటే ఈ ఈవెంట్ కూడా అనంత్-రాధిక ప్రీ వెడ్డింగ్ వేడుకలో భాగమేనని వెల్లడించారు. ఆహ్వానం ఫోటో ప్రకారం అంబానీ ఫ్యామిలీ మహారాష్ట్రలోని పాల్ఘర్‌ లో నిరుపేదల సామూహిక వివాహాన్ని నిర్వహించనుంది. పాల్ఘర్‌లోని స్వామి వివేకానంద విద్యామందిర్‌లో జూలై 2న సాయంత్రం 4:30 గంటలకు ఈ వేడుక నిర్వహించనున్నట్లు ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు.

నీతా, ముఖేష్ అంబానీ ఈ ఉదాత్తమైన ప్రయత్నానికి సహకరిస్తున్నారు. ఈ సందర్భంగా వారు కుటుంబ సమేతంగా హాజరుకానున్నారు. ఈ వేడుకలో మీరు మాతో చేరాలని మేము కోరుకుంటున్నామని వెల్లడించారు. అనంత్ అంబానీ(Anant Ambani), రాధిక మర్చంట్ పెళ్లికి ముందు అంబానీ ఫ్యామిలీ రెండు ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్లను ఏర్పాటు చేశారు. స్టార్లు, ప్రముఖ వ్యాపారవేత్తలతో జామ్‌నగర్‌లో తొలి వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. రెండో కార్యక్రమాన్ని ఇటీవల క్రూయిజ్‌లో నిర్వహించారు.

Also Read : CM Chandrababu : గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లనే పోలవరం కి కోలుకోలేని నష్టం వాటిల్లింది

Leave A Reply

Your Email Id will not be published!