Anantapur District : అనంతపురం జిల్లాలో ఊహించని దారుణం

దీంతో రెండు సార్లు ఆ బాలికకు అబార్షన్ సైతం చేయించారు...

Anantapur  : శ్రీసత్యసాయి జిల్లాలోని రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని రామగిరి మండలంలో అమానవీయ ఘటన చోటు చేసుకొంది. దళిత బాలికపై గత రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్న ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఆరుగురు వ్యక్తులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. అయితే ఈ అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో మైనర్ల నుంచి 50 ఏళ్ల పైబడిన వ్యక్తులు వరకు ఉన్నట్ల తెలుస్తోంది.

Anantapur Girl Sexual Assult

ఏడుగుర్రాలపల్లెకు చెందిన ఎనిమిదో తరగతి చదువుతోన్న దళిత బాలికపై గత రెండేళ్లుగా అత్యాచారం జరుగుతోంది. ఆ క్రమంలో ఆ బాలిక తల్లిదండ్రులు.. పంచాయతీ కోసం గ్రామ పెద్దల వద్దకు వెళ్లారు. దీంతో వారు సైతం ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో రెండు సార్లు ఆ బాలికకు అబార్షన్ సైతం చేయించారు. ఆ తర్వాత ఆ బాలిక కుటుంబాన్నిగుట్టుచప్పుడు కాకుండా కొండ గుట్టల్లో దాచారు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఈ ఘటనపై రామగిరి పోలీసులు ఆరా తీశారు. అనంతరం దళిత బాలిక కుటుంబం జాడ కనిపెట్టి.. అనంతపురం(Anantapur)లోని సత్య కేంద్రానికి వారిని తరలించారు.

ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రత్న వెల్లడించారు. నిందితులపై ఫోక్సో యాక్ట్‌, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటితోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశామని.. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారని చెప్పారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ రత్న వివరించారు.

ఇక ఈ అత్యాచార ఘటనను నిందితులు వీడియో సైతం తీశారని తెలిపారు. బాధితురాలుకు వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించామన్నారు. బాలికకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ రోజు అచ్చంపల్లి వద్ద నిందితులు తలారి మురళి, పడగొల్లు నందవర్ధన్, నాగరాజు, సంజీవ, రాజన్న, రంగన్నలను అరెస్ట్ చేశామన్నారు. అనంతరం వీరిని రిమాండ్‌కు తరలిస్తున్నామని తెలిపారు. మిగిలిన నిందితులను సైతం సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిందితులను పట్టుకొని వారిని కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు.

Also Read : YS Sharmila : తోబుట్టువునే వదలని జగన్ ప్రజలను ఎం గౌరవిస్తాడు

Leave A Reply

Your Email Id will not be published!