Anurag Thakur Ramiz Raja : ర‌మీజ్ ర‌జా కామెంట్స్ డోంట్ కేర్

పీసీబీ చైర్మ‌న్ పై కేంద్ర మంత్రి ఫైర్

Anurag Thakur Ramiz Raja : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ ర‌మీజ్ ర‌జా(Ramiz Raja) చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపాయి. ప్ర‌పంచ క్రికెట్ వ‌ర్గాల‌లో అత్యంత ఆస‌క్తిని రేపాయి. పాకిస్తాన్, భార‌త్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు కొన‌సాగుతున్నాయి. గ‌త కొన్నేళ్లుగా ఇరు దేశాల జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ లు జ‌ర‌గ‌డం లేదు. కేవ‌లం త‌ట‌స్థ వేదిక‌ల మీద మాత్ర‌మే పాకిస్తాన్ ,ఇండియా త‌ల‌ప‌డుతున్నాయి.

దుబాయ్ లో జ‌రిగిన ఆసియా క‌ప్ లో , ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో త‌ల‌ప‌డ్డాయి. భార‌త జ‌ట్టు చేతిలో పాకిస్తాన్ మొద‌ట ఓడి పోగా రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా ప‌రాజ‌యం పాలైంది. ఈ త‌రుణంలో వ‌చ్చే ఏడాది రెండు కీల‌క‌మైన మెగా టోర్నీలు జ‌ర‌గ‌నున్నాయి.

ఆసియా క‌ప్ పాకిస్తాన్ లో జ‌ర‌గ‌నుండ‌గా ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ భార‌త్ లో జ‌ర‌గ‌నుంది. ఇదిలా ఉండ‌గా ఆట‌గాళ్ల భ‌ద్ర‌త దృష్ట్యా పాకిస్తాన్ లో జ‌రిగే ఆసియా క‌ప్ లో పాల్గొన‌డం లేద‌ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా ప్ర‌క‌టించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు ర‌మీజ్ ర‌జా. త‌మ‌తో భార‌త్ ఆడ‌క పోతే తాము ఇండియాలో ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడేది లేదంటూ ప్ర‌క‌టించాడు.

దీనిపై సీరియ‌స్ గా స్పందించారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur). పాకిస్తాన్ బోర్డు చైర్మ‌న్ బెదిరింపుల‌కు తాము భ‌య‌ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. స‌రైన స‌మ‌యం కోసం వేచి ఉండాల‌న్నారు. ప్ర‌పంచ క్రీడా రంగంలో భార‌త్ అత్యంత బ‌లమైన పాత్ర పోషిస్తుంద‌ని ఏ దేశ‌మూ త‌మ‌ను విస్మ‌రించ‌ద‌ని తెలుసుకోవాల‌ని సూచించారు ర‌మీజ్ ర‌జాకు.

Also Read : రాణించినా రెండో వ‌న్డేలో సంజూపై వేటు

Leave A Reply

Your Email Id will not be published!