CM Chandrababu : ఏపీ మంత్రులకు ర్యాంకులు..6వ స్థానంలో సీఎం..మిగతా మంత్రులు..

అయితే ఫైల్స్ క్లియరెన్స్‌లో తొలి స్థానంలో ఎన్ఎండీ ఫరూఖ్ ఉంటే....

CM Chandrababu : మొదటి ఆరు నెలలు ఫర్వాలేదు.. ఇక ఊరుకోనని మంత్రులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రుల పనితీరును సీఎం చంద్రబాబు(CM Chandrababu) వివరించారు. తాను 6వ స్థానంలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఫైల్స్ వేగంగా క్లియర్ చేయాలని మంత్రులకు సీఎం సూచించారు. అయితే ఫైల్స్ క్లియరెన్స్‌లో తొలి స్థానంలో ఎన్ఎండీ ఫరూఖ్ ఉంటే.. చివరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారన్నారు.

CM Chandrababu Comment

ఇక మంత్రులు వరుసగా.. కందుల దుర్గేష్ (2), కొండపల్లి శ్రీనివాస్ (3), నాదెండ్ల మనోహర్ (4), డోలా బాల వీరాంజనేయులు (5), సీఎం చంద్రబాబు (6), సత్యకుమార్ (7), లోకేష్ (8), బీసీ జనార్థన్ రెడ్డి (9), పవన్ కల్యాణ్ (10), సవిత (11), కొల్లు రవీంద్ర (12), గొట్టిపాటి రవికుమార్ (13), నారాయణ (14), టీజీ భరత్ (15), ఆనం రాంనారాయణరెడ్డి (16), అచ్చెన్నాయుడు (17), రాంప్రసాద్ రెడ్డి (18), గుమ్మడి సంధ్యారాణి (19), వంగలపూడి అనిత (20), అనగాని సత్యప్రసాద్ (21), నిమ్మల రామానాయుడు (22), కొలుసు పార్థసారధి (23), పయ్యావుల కేశవ్ (24), చివరి 25వ స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు.

తక్కువ ఫైల్స్ ఉండే వాళ్లు కూడా క్లియరెన్స్‌లో వెనుకబడి ఉంటే ఎలా? అంటూ వెనుకబడిన మంత్రులను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. మధ్యాహ్న భోజన పథకానికి న్యాణ్యమైన బియ్యం ఇవ్వాలని మంత్రులను ఆదేశించారు.రెవెన్యూ, పోలీస్ శాఖపై ఫిర్యాదులు వస్తున్నాయి.. వాటిని తగ్గించాల్సి ఉందన్నారు. రెవెన్యూపై ఫిర్యాదులను త్వరలో తగ్గిస్తామని ఈ సందర్భంగా ఆ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. ఇన్‌చార్జ్ మంత్రులు ఇసుక, మద్యంలో ఫిర్యాదులపై వెంటనే సమీక్షించాలన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్‌పై వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. రెండు, మూడు నెలల్లో విధివిధానాలు ఖరారు చేయాలని ఆదేశించారు.

Also Read : PM Narendra Modi : కాంగ్రెస్ ద్వేషపూరిత రాజకీయాలతో ప్రజలను మోసం చేసింది

Leave A Reply

Your Email Id will not be published!