AP Police Officers Association: వరద బాధితులకు ఏపీ పోలీసు అధికారుల సంఘం భారీ విరాళం !

వరద బాధితులకు ఏపీ పోలీసు అధికారుల సంఘం భారీ విరాళం !

AP Police Officers: ఏపీను ముఖ్యంగా విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసిన వరద సహాయక చర్యల కోసం పెద్ద ఎత్తున దాతలు విరాళాలు అందిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు వరద బాధితుల సహాయం కోసం సీఎం సహాయ నిధికి ప్రభుత్వ ఉద్యోగులు, కార్పోరేట్ సంస్థలు, రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా సీఎం సహాయనిధికి తమ విరాళాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు అధికారుల సంఘం ఆదివారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో సీఎం చంద్రబాబును కలిసి విరాళాలు అందించారు. ఏపీ పోలీసు(AP Police) అధికారుల సంఘం తరపున రూ.11,12,50,000 విరాళం అందించారు.

AP Police Officers – ఆదివారం సీఎం సహాయ నిధికి విరాళాలు అందించిన వారి వివరాలు !

దీపక్ నెక్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత ఏవీ సుబ్రహ్మణ్యం కోటి రూపాయలు
వాటర్ సప్లై కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రూ.50 లక్షలు
వై.రాజారావు రూ.10 లక్షలు, కె.సాంబశివరావు రూ.5 లక్షలు, సి.టి.చౌదరి రూ.2.55లక్షలు
శ్రీ కోవిల్ ఫ్లాట్స్ ఒనర్స్ రెసిడెంట్ అసోసియేషన్ రూ.2.21లక్షలు
వెలగపూడి సత్యనారాయణ రూ.2లక్షలు
ఎమ్.శ్రీనివాసరావు రూ.2లక్షలు, పువ్వాడ రామకృష్ణ రూ.2లక్షలు, సీహెచ్.శివరామకృష్ణ రూ.1.32లక్షలు, నవీన్ బాబు రూ.1.16లక్షలు, జాస్తి శైలజారాణి రూ.లక్ష
శాంభవి రూ.లక్ష, జె.శశాంక్ చౌదరి రూ.లక్ష, ఎస్.సాంబశివరావు రూ.లక్ష, దూళిపాళ్ల రామకృష్ణ రూ.లక్ష, డాక్టర్ యు.గంగాధర్ రెడ్డి రూ.లక్ష, చెరుకూరి వెంకటరావు రూ.లక్ష,
జె.సత్యనారాయణ మూర్తి రూ.లక్ష, ఎన్.నాగేశ్వరరావు రూ.70 వేలు, రాణి శారదా రూ.50వేల విరాళం చెక్కును సీఎంకు అందించారు. వరద బాధితులను ఆదుకునేందుకు సాయం అందిస్తున్న దాతలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : CM Revanth Reddy: జర్నలిస్టుల గుర్తింపుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు !

Leave A Reply

Your Email Id will not be published!