AP TET 2024 : టెట్ పరీక్షలకు నయా షెడ్యూల్ రిలీజ్ చేసిన ఏపీ సర్కార్

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ మంత్రి కోన శశిధర్ జీవో నంబర్ 284ను ప్రకటించారు...

AP TET 2024 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెట్ పరీక్షల కొత్త షెడ్యూల్‌ను సోమవారం ప్రకటించింది. అక్టోబరు 3 నుంచి అక్టోబర్ 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. అక్టోబరు 4 నుంచి కీలు విడుదల చేసి తుది ఫలితాలు నవంబర్ 2న విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన రెండో నోటిఫికేషన్ ప్రకారం.. వచ్చే నెల 8వ తేదీలోపు చెల్లింపు గేట్‌వే ద్వారా ఫీజు చెల్లించవచ్చు మరియు ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ ఆగస్టు 3.

AP TET 2024 Updates

సెప్టెంబర్ 19 నుంచి ఆన్‌లైన్ మాక్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నామని, సెప్టెంబర్ 22 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ జీవో నంబర్ 284ను ప్రకటించారు. డీఎస్సీ రాయాలనుకునే వారు టెట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో భాగంగా 16,347 పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ ఫైలుపై సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేసిన సంగతి తెలిసిందే. అయితే బీఈడీ, డీఈడీ పూర్తిచేసిన వారికి కూడా మెగా డీఎస్సీ రాసేందుకు అవకాశం కల్పించేందుకు టెట్ నిర్వహించాలన్న అభ్యర్థన మేరకు ప్రభుత్వం కొత్త టెట్ నోటిఫికేషన్‌ను ప్రకటించింది.

Also Read : YS Jagan : వైఎస్ఆర్ 75వ జయంతి నివాళులు అర్పించిన జగన్, షర్మిల

Leave A Reply

Your Email Id will not be published!