Arvind Sawant : శివ‌సేన అంతం మోదీ పంతం – సావంత్

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన శివ‌సేన ఎంపీ

Arvind Sawant : మాజీ కేంద్ర మంత్రి, శివ‌సేన ఎంపీ అర‌వింద్ సావంత్(Arvind Sawant) షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. మంగ‌ళ‌వారం అర‌వింద్ సావంత్ మీడియాతో మాట్లాడారు.

బాలా సాహెబ్ ఠాక్రే స్నేహ హ‌స్తం ఇస్తే మోదీ మాత్రం శివ‌సేన పార్టీని అంతం చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

అందుకే కావాల‌ని ప‌దే ప‌దే మ‌రాఠాలో ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా ఎన్నికైన ప్ర‌భుత్వాన్ని కూల దోసేందుకు ప్ర‌య‌త్నాలు చేశారంటూ మండిప‌డ్డారు. ప్ర‌శాంతంగా ఉన్న స‌మ‌యంలో కూల్చే ప‌నిని పెట్టుకున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

శివసేన‌ను పూర్తిగా లేకుండా చేయాల‌ని కుట్ర ప‌న్నార‌ని, ఆ దిశ‌గా బాలా సాహెబ్ ఠాక్రేకు ఒక ర‌కంగా ద్రోహం తల‌పెట్టాడ‌ని నిప్పులు చెరిగారు. మ‌రాఠా ప్ర‌జ‌లు ఎవ‌రికీ లొంగ‌ర‌ని, ఆత్మాభిమానం క‌లిగిన వార‌ని అది ప్ర‌ధాన మంత్రి తెలుసు కోవాల‌న్నారు.

అన్ని రోజులు ఒకేలా ఉండ‌వ‌ని, ఏదో ఒక రోజు శివ‌సేన‌ది అవుతుంద‌న్న విష‌యం గుర్తు పెట్టుకోవాల‌న్నారు అర‌వింద్ సావంత్.

ఎవ‌రి ఫోటో పెట్టుకుని గెలిచారో, ఏ పార్టీ బి ఫామ్ ఇస్తే ఇవాళ ఎమ్మెల్యేలుగా, మంత్రులు అయ్యారో ఒక్క‌సారి గుర్తు తెచ్చు కోవాల‌ని ధిక్కార స్వ‌రం వినిపించిన వారిని ఉద్దేశించి అన్నారు.

ప్ర‌స్తుతం తిరుగుబాటు ప్ర‌క‌టించిన వారంతా ఎందుకు చేస్తున్నారో వారికే తెలియాలి. కానీ వారు మాత్రం బాలా సాహెబ్ ఠాక్రేకు ద్రోహం మాత్రం చేస్తున్నార‌ని గుర్తు పెట్టుకోవాల‌న్నారు.

ప్ర‌జ‌లు మాత్రం మిమ్మ‌ల్ని క్ష‌మించ‌ర‌ని స్ప‌ష్టం చేశారు మాజీ కేంద్ర మంత్రి. ప్ర‌స్తుత ప‌రిణామాల‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీనే కార‌ణ‌మ‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నార‌ని చెప్పారు.

Also Read : బాధితుల గోడు వినాల‌ని సీజేఐకి విన్న‌పం

Leave A Reply

Your Email Id will not be published!