Anupam Kher : కాశ్మీరీ పండిట్ల‌పై దాడులు దారుణం

న‌టుడు అనుప‌మ్ ఖేర్ తీవ్ర ఆగ్ర‌హం

Anupam Kher : జ‌మ్మూ కాశ్మీర్ అట్టుడుకుతోంది. మ‌రోసారి ఉగ్ర‌వాదులు తమ పంజా విసురుతున్నారు. కాశ్మీరీ లోయ‌లో స్థిర నివాసం ఏర్ప‌ర్చుకున్న కాశ్మీరీ పండిట్ల‌ను టార్గెట్ చేశారు.

ఇప్ప‌టికే ప‌లువురిని పొట్ట‌న పెట్టుకున్నారు. మొన్న‌టికి మొన్న ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడికి పాల్ప‌డ్డారు. బీహార్ కు చెందిన వ‌ల‌స కూలీల‌ను కాల్చి చంపారు.

మంగ‌ళ‌వారం ఇద్దరు కాశ్మీరీ సోద‌రుల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డారు. కాల్పుల‌కు పాల్ప‌డ‌డంతో ఒక‌రు చ‌ని పోయారు. మరో సోద‌రుడు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ వ‌రుస ఘ‌ట‌న‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హం, ఆవేద‌న వ్య‌క్తం చేశారు ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్(Anupam Kher). ఆయ‌న తీవ్రంగా స్పందించారు. కాశ్మీరీ పండిట్ల‌పై నేటికీ అఘాయిత్యాలు కొన‌సాగ‌డం సిగ్గు చేట‌న్నారు.

అనుప‌మ్ ఖేర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ వాళ్లు త‌మ వాళ్ల‌ను కూడా చంపేస్తున్నారంటూ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. ఆయ‌న ఇటీవ‌ల దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారి తీసిన కాశ్మీరీ ఫైల్స్ మూవీలో న‌టించారు.

ఒక ర‌కంగా అందులో జీవించారు. ఎలా దేశంలోనే వాళ్లు ప‌రాయి వారుగా ఎలా మారి పోయారో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించారు ద‌ర్శ‌కుడు. ఈ సంద‌ర్భంగా అనుప‌మ్ ఖేర్ తీవ్రంగా ఖండించారు.

ఇలాంటి దాడులను ప్ర‌తి ఒక్క‌రు ఖండించాల‌ని పిలుపునిచ్చారు. భార‌త దేశానికి అండ‌గా నిలిచే ప్ర‌తి ఒక్క‌రినీ చంపేస్తున్నారంటూ వాపోయారు అనుప‌మ్ ఖేర్. ఇది గ‌త 30 ఏళ్లుగా కొన‌సాగుతూ వ‌స్తోంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా కాశ్మీరీ పండిట్ల‌పై జ‌రిగిన కాల్పుల‌ను ఖండించారు ఎంపీ ఓవైసీ. దీనికి ప్ర‌ధాన కార‌ణం భ‌ద్ర‌తా వైఫ‌ల్య‌మేన‌ని ఆరోపించారు.

Also Read : క‌ర్ణాట‌క మంత్రి ఆడియో లీక్ క‌ల‌క‌లం

Leave A Reply

Your Email Id will not be published!