Jitta Balakrishna Reddy : తెలంగాణ ఉద్యమకారుడు ‘జిట్టా బాలకృష్ణ రెడ్డి’ మరణించారు

ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఇవాళ ఉదయం ప్రాణాలు విడిచారు...

Jitta Balakrishna Reddy : బీఆర్ఎస్ పార్టీలో విషాదం నిండింది. తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణ రెడ్డి శుక్రవారం ఉదయం మరణించారు. ఆయన బ్రెయిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ 2 నెలలకుపైగా హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి ఇవాళ ఉదయం ప్రాణాలు విడిచారు. జిట్టా మరణ విషయాన్ని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. ఆయన స్వగ్రామమైన భువనగిరికి బాలకృష్ణారెడ్డి పార్ధివ దేహాన్ని తరలిస్తున్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఆయన అంతక్రియలు జరగనున్నాయి. ఉద్యమకారుడి మృతి పట్ల గులాబీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Jitta Balakrishna Reddy No More..

తెలంగాణ ఉద్యమకారుడిగా గుర్తింపు పొందిన జిట్టా తెలంగాణ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ఆవిర్భావం తరువాత ఆ పార్టీలో చేరారు. టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌లో చేరిన ఆయన వైఎస్ మరణానంతరం వైసీపీలో చేరారు. ఆ తరువాత యువ తెలంగాణ పార్టీ స్థాపించారు. తరువాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. చివరికి సొంత గూటికి(బీఆర్ఎస్)కి చేరుకున్నారు.

Also Read : Congress : ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ లో చేరిన భజరంగ్ పునియా, వినేశ్ ఫోగట్

Leave A Reply

Your Email Id will not be published!