Budget Session 2024 : రాష్ట్రపతి ఆధీనంలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం

బడ్జెట్ సెషన్‌లో కేంద్రం ఇప్పుడు 19 బిల్లులను ప్రవేశపెట్టనుంది

Budget Session 2024 : పార్లమెంట్ లో బడ్జెట్ చర్చలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) తన ప్రారంభోత్సవ సెషన్‌లో కొత్త పార్లమెంటులో పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం 11:30కి మళ్లీ అఖిలపక్షం కలవనుంది. ప్రస్తుత 17వ లోక్ సభకి ఇవి చివరి సమావేశాలు, అయితే కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం తర్వాత మొదటి బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈ ఏడాది కూడా లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాల్లోనే కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు బడ్జెట్‌పై ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెడతారు.

Budget Session 2024 Updates

బడ్జెట్ సెషన్‌లో కేంద్రం ఇప్పుడు 19 బిల్లులను ప్రవేశపెట్టనుంది. రాజ్యసభ రాష్ట్ర ప్రివిలేజెస్ కమిషన్ మంగళవారం 11 మంది సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. కాగా, బడ్జెట్ సెషన్‌లో అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు స్పష్టం చేసింది.

లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్‌ను సమర్పించేందుకు మోడీ సర్కార్ సిద్ధమవుతుండగా.. విపక్షాలు మాత్రం కేంద్రాన్ని నిలదీసేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. నిరుద్యోగం, అధిక ధరలు, ఆర్థిక అసమానత కారణంగా రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలకు మోదీ ప్రభుత్వమే కారణమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Also Read : Bronze Statue for PM Modi: ప్రధాని మోదీ కాంస్య విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ !

Leave A Reply

Your Email Id will not be published!