Rhea Chakraborty : సుశాంత్ కేసులో రియాపై ఛార్జిషీట్
మరో 34 మంది పేర్ల నమోదు
Rhea Chakraborty : ప్రముఖ బాలీవుడు సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్న కేసులో కీలక మలుపు తిరిగింది. ఆయన ప్రియురాలిగా భావిస్తున్న రియా చక్రవర్తికి షాక్ తగిలింది.
సుశాంత్ కి సంబంధించిన డ్రగ్స్ కేసులో రియా పై ఛార్జి షీట్ నమోదు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్సీబీ). ఈ కేసులో మరో 34 మందిని కూడా చేర్చారు.
డ్రగ్స్ కేసులో నటి రియా చక్రవర్తికి(Rhea Chakraborty) ప్రధాన పాత్ర ఉన్నట్లు అభియోగాలు పేర్కొనడం కలకలం రేపింది. రియా చక్రవర్తి సుశాంత్ రాజ్ సింగ్ పుత్ కేసులో గంజాయిని కొనుగోలు చేసి, ఫైనాన్సింగ్ కూడా చేసినట్లు ఎన్సీబీ నమోదు చేసిన కేసులో పేర్కొంది.
2020లో నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. అంతే కాకుండా సంచలన ఆరోపణలు చేసింది ఎన్సీబీ.
రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు డ్రగ్స్ అందచేసిందని, అంతే కాకుండా ఇంకొందరికి డెలివరీ చేసిందని స్పష్టం చేసింది. అంతే కాకుండా డబ్బులు కూడా చెల్లించిందంటూ పేర్కొంది.
ప్రస్తుతం ఎన్సీబీ చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. ఇదిలా ఉండగా నేరం గనుక రుజువైతే రియా చక్రవర్తికి 10 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
రియా చక్రవర్తి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో సెప్టెంబర్ 2020లో అరెస్ట్ అయ్యింది. ఆమె అరెస్ట్ అయిన దాదాపు నెల రోజుల తర్వాత బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Also Read : సల్మాన్ ఖాన్ ను ఎప్పటికీ క్షమించం