CM Chandrababu : ఆడబిడ్డలపై చేయి వేయాలంటే భయపడే పరిస్థితిని రాష్ట్రంలో తీసుకురావాలని పోలీస్ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రామగిరి మండలంలో ఎనిమిదో తరగతి బాలికపై సామూహిక లైంగిక దాడి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఈ ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేసి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం అమరావతిలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటు చేసుకున్న ఘటనలపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
CM Chandrababu Slams
ఈ సందర్భంగా ఒక యువతి హత్య, మరో బాలికపై సామూహిక అత్యాచారం కేసును వేగంగా విచారణ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పక్కా ఆధారాల సేకరణతో నిర్దిష్ట సమయంలో నిందితులకు శిక్ష పడేలా చూడాలని అధికారులకు ఆయన సూచించారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నానన్నారు. గంజాయి బ్యాచ్ ఆట కట్టించాలని స్పష్టం చేశారు. ఇక ఈ రెండు ఘటనల్లో దర్యాప్తు, చర్యల వివరాలను సీఎం చంద్రబాబుకు(CM Chandrababu) ఈ సందర్భంగా డీజీపీ, ఉన్నతాధికారులు వివరించారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రామగిరి మండలంలో ఎనిమిదో తరగతి చదువుతోన్న దళిత బాలికపై గత రెండేళ్లుగా అత్యాచారం జరుగుతోంది. ఈ ఘటనలో యువకుల నుంచి 60 ఏళ్ల వృద్ధల వరకు ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆరుగురు నిందితులను మంగళవారం అచ్చంపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఏడుగురు నిందితులు పరారీలో ఉన్నారు. వారిని సైతం అరెస్ట్ చేస్తామని శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న వెల్లడించారు. బాధితురాలని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించామన్నారు. అలాగే బాధితురాలికి పూర్తి భద్రత కల్పించామని స్పష్టం చేశారు.
Also Read : Anantapur District : అనంతపురం జిల్లాలో ఊహించని దారుణం