CM Chandrababu : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ సీఎం భేటీ

కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీ స‌మ‌స్య‌ల‌కు ప్రాధాన్య‌త‌తో నిధులు కేటాయించాల‌ని ఆర్థిక మంత్రిని ఏపీ ముఖ్య‌మంత్రి కోరారు....

CM Chandrababu : ఢిల్లీ పర్యటనలో భాగంగా రెండో రోజు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వరుస సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. బాబుతోపాటు, రామ్మోహన్ నాయుడు, పెన్మసాని, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, టీడీపీ ఎంపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరవ్ కుమార్ ప్రసాద్, ఏపీ ఆర్థిక మంత్రి పీయూష్ కుమార్‌లతో వారు సమావేశమయ్యారు.

CM Chandrababu Meet

కేంద్ర బ‌డ్జెట్‌లో ఏపీ స‌మ‌స్య‌ల‌కు ప్రాధాన్య‌త‌తో నిధులు కేటాయించాల‌ని ఆర్థిక మంత్రిని ఏపీ ముఖ్య‌మంత్రి కోరారు. అంతకుముందు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యంతో చంద్రబాబు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. అనంతరం 11:30 గంటలకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు.

Also Read : NEET: నీట్‌ ను రద్దు చేయొద్దంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించిన 56 మంది ర్యాంకర్లు !

Leave A Reply

Your Email Id will not be published!