CM Chandrababu : భారత్ కు మోదీ నాయకత్వం ప్రధాన బలం
1995 నుంచి తాను మాత్రమే దావోస్ తరచూ వెళ్తున్నానని చెప్పుకొచ్చారు...
CM Chandrababu : ఉమ్మడి ఏపీలో సీఐఐ సదస్సులు నిర్వహించానని, తాను మొదటి నుంచి పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ వచ్చానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(CM Chandrababu) వ్యాఖ్యానించారు. పీవీ ఆర్థిక సంస్కరణలు దేశగతిని మార్చేశాయని ఉద్ఘాటించారు. 1990లోనే ఇంటర్నెట్ విప్లవం వచ్చిందని గుర్తుచేశారు. దావోస్లో ఏటా పారిశ్రామికవేత్తల సదస్సు జరుగుతుందని తెలిపారు. గతంలో దావోస్ వెళ్లవద్దని కొందరు తనకు సూచించారని.. ప్రముఖులతో సంబంధాల దృష్ట్యా పేదలు ఓట్లు వేయరని చెప్పారని గుర్తుచేశారు. ఆ సమయంలో ప్రధాని కూడా దావోస్ వెళ్లలేదని చెప్పారు.
CM Chandrababu Naidu Key Comments on Economic Growth
1995 నుంచి తాను మాత్రమే దావోస్ తరచూ వెళ్తున్నానని చెప్పుకొచ్చారు. సంపద సృష్టి జరగాలి.. అది పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమని అన్నారు. సంపద సృష్టి ద్వారానే ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ఇవాళ(శుక్రవారం) ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) పర్యటిస్తున్నారు. సాయంత్రం 4:30లకు సీఐఐ సదస్సుకు(CII Conference) సీఎం చంద్రబాబు హాజరయ్యారు ఏపీ అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వివరించారు. రాత్రికి ఢిల్లీలోనే సీఎం చంద్రబాబు బస చేయనున్నారు. రేపు ఢిల్లీ నుంచి నేరుగా రాజమండ్రికి చంద్రబాబు రానున్నారు. ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చని వెల్లడించారు. సరైన సమయంలో దేశానికి ప్రధానిగా మోదీ ఉన్నారని ఉద్ఘాటించారు. భారత్కు మోదీ నాయకత్వం ప్రధాన బలమని కొనియాడారు. చైనా ఆర్థిక వ్యవస్థ భారత్కు నాలుగున్నర రెట్లు.. అమెరికా ఆర్థిక వ్యవస్థ భారత్ కంటే ఏడు రెట్లు ఎక్కువ అని వ్యాఖ్యానించారు.
సరైన పాలసీలు రూపొందిస్తే మన ప్రగతిని ఎవరూ ఆపలేరని చెప్పుకొచ్చారు. దేశానికి రానున్న పదేళ్లు అత్యంత కీలకమని అన్నారు. హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ.. అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ అని అభివర్ణించారు. ఐటీ పరిశ్రమల వల్లే హైదరాబాద్కు లబ్ధి జరిగిందని తెలిపారు. 2047 విజన్ లక్ష్యంగా భారత్ సాగుతోందని చెప్పారు. సాంకేతిక విప్లవంలో చాలా మార్పులు వచ్చాయని అన్నారు.ఏపీలో 15 శాతం వృద్ధి రేటు తన లక్ష్యమని అన్నారు. అమరావతిలో దేశంలోనే తొలిసారి క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు. విశాఖపట్నానికి టీసీఎస్, గూగుల్, మిట్టల్ పరిశ్రమలు వచ్చాయని వెల్లడించారు.
ఏపీలో గ్రీన్ ఎనర్జీకి మంచి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. ఏడాదిలోనే ఏపీలో రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని స్పష్టంచేశారు. ఈ ప్రాజెక్టులతో 4.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. పారిశ్రామికవేత్తలను ఏపీకి ఆహ్వానిస్తున్నామని అన్నారు. ఏపీలో పలు రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఏపీలో ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని కోరారు. డెమోగ్రాఫిక్ డివిడెండ్ను భారత్ సరిగా ఉపయోగించుకోవాలని సూచించారు. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, డ్రోన్లదే కీలక పాత్ర అని ఉద్ఘాటించారు. ఇప్పుడు సమాజానికి కావాల్సింది పారిశ్రామికవేత్తలేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read : Minister Ponguleti : ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ పై మంత్రి పొంగులేటి విసుర్లు