CM Chandrababu Naidu: కడప నుండి నేరుగా ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు

కడప నుండి నేరుగా ఢిల్లీకి చేరుకున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu Naidu : ఢిల్లీలో పర్యటన నిమిత్తం ఏపీ సీఎం చంద్రబాబు గురువారం ఢిల్లీ వెళ్లారు. మహానాడును ముగించుకుని కడప నుంచి నేరుగా ఢిల్లీకి గురువారం సాయంత్రం చేరుకున్నారు. విమానాశ్రయంలో చంద్రబాబుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, సానా సతీష్‌తో సహా పలువురు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా అధికారిక నివాసం వన్‌జన్‌పథ్‌కు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. రేపు (శుక్రవారం) సీఐఐ సదస్సుకు చంద్రబాబునాయుడు(CM Chandrababu Naidu) హాజరుకానున్నారు. గురువారం, శుక్రవారం రాత్రి కూడా ఢిల్లీలోనే ముఖ్యమంత్రి బస చేయనున్నారు. ఢిల్లీ నుంచి శనివారం రాజమండ్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు.

CM Chandrababu Naidu Reached to Delhi

రేపు (శుక్రవారం) రాత్రి ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఢిల్లీ నుంచి ఎల్లుండి (శనివారం) రాజమండ్రికి ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం గున్నేపల్లిలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో శనివారమే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. గున్నేపల్లి గ్రామస్తులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం ప్రజలను అడిగి వారి సమస్యలను సీఎం చంద్రబాబు తెలుసుకోనున్నారు.

అయితే, గురువారం మహానాడు ప్రాంగణం నుంచి ఎయిర్ పోర్టుకు సీఎం చంద్రబాబు బయలుదేరారు. చంద్రబాబును చూసేందుకు దారి పొడుగునా రోడ్లకు ఇరువైపులా శ్రేణులు బారులు దీరారు. పార్టీ శ్రేణుల కోలాహలంతో నెమ్మదిగా సీఎం కాన్వాయ్ వెళ్లింది. ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గంలో రెండుసార్లు ఆగి ప్రజలకు చంద్రబాబు అభివాదం చేశారు.

Also Read : AP Liquor Scam: సిట్ కస్టడీకి ఏపీ లిక్కర్ స్కామ్‌ నిందితులు

Leave A Reply

Your Email Id will not be published!