CM Chandrababu : ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ తీసుకొస్తాం

ప్రస్తుతం ఇళ్లపైనే విద్యుదుత్పత్తి చేసుకునే దశకు వచ్చామని, ఇది ఏపీ ప్రగతికి నిదర్శనమని తెలిపారు.

CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) ప్రకటించారు. మంగళవారం విశాఖ నోవాటెల్‌లో జరిగిన ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్‌లో ఆయన పాల్గొని పారిశ్రామిక వర్గాలతో భవిష్యత్ వ్యూహాలపై చర్చించారు.

CM Chandrababu – ఏపీకి లాజిస్టిక్ ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్

భవిష్యత్తులో రోడ్లు, రైలు, సముద్రం, ఎయిర్ లాజిస్టిక్స్‌కు విస్తృత అవకాశాలు ఉన్నాయని సీఎం పేర్కొన్నారు. రోడ్ల మాదిరిగానే నదులను కూడా అనుసంధానం చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఇళ్లపైనే విద్యుదుత్పత్తి చేసుకునే దశకు వచ్చామని, ఇది ఏపీ ప్రగతికి నిదర్శనమని తెలిపారు.

CM Chandrababu – పోర్టులు, ఎయిర్‌పోర్టులు – అభివృద్ధి లక్ష్యం

రాష్ట్రంలో లాజిస్టిక్స్ సౌకర్యాలను మరింత విస్తరించేందుకు పలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు చంద్రబాబు వివరించారు.

  • ప్రతి 50 కిలోమీటర్లకో ఒక పోర్ట్‌ను ఏర్పాటు చేయడం లక్ష్యమని తెలిపారు.
  • ఎయిర్‌పోర్టులు, కొత్త పోర్టులు, కార్గో హబ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
  • ఫార్మా, ఆక్వా, వ్యవసాయ రంగాలలో ఏపీకి ఉన్న బలాన్ని గ్లోబల్ మార్కెట్లో ఉపయోగించుకోవాలని సూచించారు.

షిప్ బిల్డింగ్‌లో ముందడుగు

ఇండియా షిప్ బిల్డింగ్ రంగంలో వెనుకబడి ఉందని గుర్తుచేసిన సీఎం, ఈ రంగంలో రాష్ట్రంలో మూడు నుంచి నాలుగు ప్రాంతాలు కేటాయించామని తెలిపారు. ఎవరైనా ముందుకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యం చేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. పోర్ట్ ఆధారిత ఎకానమీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

డిఫెన్స్, మెరైన్ రంగాల్లో ప్రణాళికలు

రాష్ట్రంలో డిఫెన్స్, మెరైన్ షిప్ బిల్డింగ్, కంటైనర్ టెర్మినల్స్ ఏర్పాటుకు కూడా ప్లాన్ చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. మంచి ప్రతిపాదనలతో వచ్చే పెట్టుబడిదారులతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వయబిలిటీ ఫండింగ్ ద్వారా ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

టెక్నాలజీ & ఎడ్యుకేషన్ హబ్‌గా ఏపీ

విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటుకు ఇప్పటికే చర్యలు మొదలైనట్లు తెలిపారు. వైజాగ్ త్వరలోనే డేటా హబ్గా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అదనంగా, జీఎంఆర్ సంస్థ ఏవియేషన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతోందని ప్రకటించారు.

ప్రజల సహకారం అవసరం

ఆంధ్రప్రదేశ్‌ను లాజిస్టిక్స్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ప్రజల సహకారం కీలకమని సీఎం కోరారు. రాబోయే ఆరు నెలల్లో మరో లాజిస్టిక్స్ సమ్మిట్‌ను విశాఖలోనే నిర్వహిస్తామని తెలిపారు.

Also Read : Minister Nara Lokesh: ఇంట్లో ‘నాన్న’, పనిలో ‘బాస్‌’- చంద్రబాబుకు లోకేశ్ విషెస్‌

Leave A Reply

Your Email Id will not be published!