CM Chandrababu : చీనాబ్ రివర్ బ్రిడ్జి పై సీఎం చంద్రబాబు కీలక ట్వీట్

చినాబ్ రైలు వంతెన ప్రపంచంలోనే ఎత్తైనదంటూ ముఖ్యమంత్రి కొనియాడారు...

CM Chandrababu : జమ్మూకశ్మీర్‌లో చినాబ్ నదిపై నిర్మాణమైన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈరోజు (శుక్రవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి చినాబ్ రైల్వే వంతెనను ప్రారంభించారు. తాజాగా చినాబ్ రైల్వే బ్రిడ్జ్‌ ప్రారంభోత్సవంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా కొత్త రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంపై ప్రధానికి సీఎం అభినందనలు తెలియజేశారు. ప్రధాని నాయకత్వంలో కొత్త దశ మొదలైందని.. చినాబ్ రైలు వంతెన ప్రపంచంలోనే ఎత్తైనదంటూ ముఖ్యమంత్రి కొనియాడారు.

CM Chandrababu Tweet

’జమ్మూకాశ్మీర్ అభివృద్ధిలో నూతన అధ్యాయం, ప్రధాని మోడీ నాయకత్వంలో కొత్త దశ మొదలైంది. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో నిర్మించబడిన అద్భుత నిర్మాణ శైలికి నిదర్శనంగా ఈ కట్టడం నిలుస్తుంది. ప్రపంచంలోనే ఎత్తైన రైలు వంతెన.. చినాబ్ రైలు వంతెన. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు ఆర్చ్ వంతెనగా గుర్తింపు. భారతదేశంలోనే తొలి కేబుల్-స్టేయిడ్ రైలు వంతెన. అంజి బ్రిడ్జ్ భారతదేశపు మొట్టమొదటి కేబుల్ స్టేయిడ్ రైలు వంతెనగా నిలుస్తుంది. ఉధంపూర్ – శ్రీనగర్ – బారాముల్లా రైల్వే ప్రాజెక్టు (USBRL)పూర్తయిన తర్వాత ధార్మిక పర్యాటకానికి బలం చేకూరనుంది. ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఏ కాలానికైనా అనుకూలమైన రవాణా వ్యవస్థతో వందే భారత్ రైలు.. మాత వైష్ణవి దేవి కట్రా – శ్రీనగర్ మధ్య నడవనుంది. ఈ నిర్మాణాలు దేశ గౌరవానికి ప్రతీకగా నిలుస్తున్నాయి’ అంటూ సీఎం చంద్రబాబు ట్విట్ చేశారు.

Also Read : PM Modi : కాశ్మీర్ లో శాంతి , పురోగతిని అడ్డుకునేందుకు పాక్ నిరంతర ప్రయత్నం

Leave A Reply

Your Email Id will not be published!