KCR Mogulaiah : కిన్నెర మొగుల‌య్య‌కు లైన్ క్లియ‌ర్

రూ. కోటి న‌గ‌దు, స్థ‌లం ఇవ్వాల‌ని ఆదేశం

KCR Mogulaiah : అరుదైన కిన్నెర వాయిద్య‌కారుడు నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మొగుల‌య్య‌కు(KCR Mogulaiah) శుభ‌వార్త చెప్పింది. ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ ఆయ‌న‌కు రూ. కోటి న‌జ‌రానా ప్ర‌క‌టించారు.

అంతే కాకుండా 300 గ‌జాల స్థ‌లం కూడా ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ మేర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఇందులో భాగంగా హైద‌రాబాద్ లో అత్యంత ప్రాముఖ్య‌త క‌లిగిన బిఎన్ రెడ్డి న‌గ‌ర్ లో మొగుల‌య్య‌కు ఇంటి స్థ‌లం ఇవ్వాల‌ని ఆదేశించింది.

గ‌తంలో రూ. కోటి న‌గ‌దుతో పాటు ఇంటి స్థ‌లం కూడా ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ మేర‌కు తాజాగా సీఎం(KCR Mogulaiah) ఆదేశాల మేర‌కు ప్ర‌భుత్వం కోటి న‌గ‌దుతో పాటు ఇంటి స్థ‌లం స్వ‌యంగా అంద‌జేయ‌నుంది.

అంత‌రించి పోతున్న కిన్నెర క‌ళ‌కు మొగుల‌య్య ప్రాణం పోశాడు. దానినే న‌మ్ముకుని జీవిస్తూ వ‌చ్చాడు. అత‌డి ప్ర‌తిభ‌ను గుర్తించింది ముందుగా రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు కేవీ ర‌మ‌ణాచారి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాల‌కులు మామిడి హ‌రికృష్ణ పూర్తి మ‌ద్ద‌తు తెలిపారు.

ఇదే స‌మ‌యంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన భీమ్లా నాయ‌క్ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్ ను కిన్నెర మొగుల‌య్య‌తో పాడించారు సంగీత ద‌ర్శ‌కుడు ఎస్. ఎస్. థ‌మ‌న్.

దీంతో మొగుల‌య్య మ‌రింత పాపుల‌ర్ అయ్యారు. ఈ ఒక్క మూవీని మొగుల‌య్య‌ను మ‌రింత తెలిసేలా చేసింది.

క‌ళా రంగంలో ఆయ‌న చేసిన సేవ‌ల‌ను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించింది. రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా అందుకున్నారు మొగుల‌య్య‌.

Also Read : గీతాంజలి శ్రీ‌కి బుక‌ర్ ప్రైజ్

Leave A Reply

Your Email Id will not be published!