CM Siddaramaiah : మైసూరులో చిత్రనగరి నిర్మాణం
సీఎం సిద్దరామయ్య ప్రకటన
CM Siddaramaiah : కన్నడ సినీ రంగానికి ఖుష్ కబర్ చెప్పారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య. శుక్రవారం ఇందుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. కన్నడ చిత్ర పరిశ్రమ అభివృద్ది కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. సీఎం సిద్దరామయ్య ఇవాళ మీడియాతో మాట్లాడారు. భారత దేశ సినీ రంగంలో కన్నడ సినీ రంగానికి ప్రత్యేకత ఉందన్నారు. ఇందుకు గాను యావత్ ప్రపంచం బెంగళూరు అంటేనే ఐటీ రంగం అని గుర్తుకు వస్తుందని ఇదే సమయంలో ఎంతో మంది ప్రతిభావంతులైన నటీ నటులతో పాటు టెక్నీషియన్లు ఉన్నారని పేర్కొన్నారు సీఎం.
ఇందులో భాగంగా సినీ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా ప్రైవేట్ భాగస్వామ్యంతో మైసూరు జిల్లాలో చిత్ర నగరి నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు సిద్దరామయ్య(Siddaramaiah). నాణ్యమైన కన్నడ చిత్రాలకు సబ్సిడీని అందించేందుకు పథకం పునః ప్రారంభిస్తామని చెప్పారు. అంతే కాకుండా బెంగళూరులో కన్నడ సినిమా చరిత్రను రికార్డు చేసేందుకు గాను కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ పేరుతో మెమోరియల్ దగ్గర మ్యూజియం చేపడతామని వెల్లడించారు సీఎం.
ఇదిలా ఉండగా సీఎం చేసిన సంచలన ప్రకటనతో కన్నడ సినీ రంగంలో సంతోషం వ్యక్తమైంది. నటీ నటులు , ఇతర సాంకేతిక వర్గం ధన్యవాదాలు తెలిపింది.
Also Read : SCR AGM : షార్ట్ సర్క్యూట్ వల్లే రైల్లో మంటలు
