CM YS Jagan: లండన్ చేరుకున్న సీఎం జగన్ !

లండన్ చేరుకున్న సీఎం జగన్ !

CM YS Jagan: ఏపీ సీఎం వైఎస్ జగన్ శనివారం లండన్ చేరుకున్నారు. శుక్రవారం రాత్రి కుటుంబ సమేతంగా లండన్ బయలుదేరిన సీఎం జగన్… శనివారం అక్కడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా లండన్ లోని ప్రవాసాంధ్రులు సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు. సీఎం, సీఎం అంటూ ఎయిర్ పోర్టులో నినాదాలు చేస్తూ జగన్ కు స్వాగత ఫ్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసాంధ్రులు సీఎం జగన్ తో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు.

CM YS Jagan Tour

గత కొంతకాలంగా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన సీఎం జగన్… పోలింగ్ అనంతరం విదేశాలకు వెళ్ళడానికి కోర్టు నుండి అనుమతి తీసుకున్నారు. పోలింగ్ మే 13న జరిగినప్పటికీ… కౌంటింగ్ జూన్ 4న నిర్వహిస్తుండటంతో… ఈ మధ్యలో ఉన్న ఖాళీ సమయాన్ని కుటుంబానికి కేటాయించారు. ఈ నేపథ్యంలో లండన్ పర్యటనకు సీబీఐ కోర్టు నుండి అనుమతి తీసుకున్నారు. సుమారు 14 రోజుల పాటు లండన్ లో పర్యటించిన అనంతరం ఈ నెల 31న తిరిగి ఇండియాకు చేరుకుంటారు. సీఎం జగన్ కుమార్తెలు ఇద్దరూ లండన్ లోని ప్రముఖ బిజినెస్ స్కూల్స్ లో చదువుతున్న సంగతి తెలిసిందే.

Also Read : AP News : ఏపీలో ఆ 3 జిల్లాలకు కొత్త ఎస్పీల నియామకం

Leave A Reply

Your Email Id will not be published!