Covid-19 Cases : రోజు రోజుకు పెరుగుతున్న మహమ్మారి కరోనా కేసులు
వ్యాప్తి తక్కువ అయినప్పటికీ అలెర్ట్గా ఉండాలని కేంద్రం సూచిస్తోంది...
Covid-19 : దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1010కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య వెయ్యిని దాటడం హడలెత్తిస్తోంది. భారత్లో ఎన్బీ 1.8.1, ఎల్ఎఫ్ 7, అనే కరోనా కొత్త వేరియంట్లు ప్రభావం చూపుతున్నట్లు ఇప్పటికే ఇండియన్ జీనోమిక్స్ కన్సార్టియం వెల్లడించింది. ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో పరిస్థితి అదుపులోనే ఉందని.. వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉందని గుర్తించింది. అందులోనూ.. జేఎన్ 1 సబ్ వేరియంట్ అయిన ఎన్బీ 1.8.1 వంటి కొత్త వేరియంట్లు బాధితులపై తీవ్ర ప్రభావం చూపినట్లు ఆధారాలు లభించలేదని తెలిపింది.
Covid-19 Cases in India
అయితే.. కోవిడ్ 19(Covid-19) కేసుల పెరుగుదలకు సంబంధించి పలు కీలక విషయాలు వెల్లడించారు వైద్య నిపుణులు. గతంలో ఇన్ఫెక్షన్లు సోకడం, టీకాలు వేసుకోవడం ద్వారా వచ్చిన రోగనిరోధక శక్తి తగ్గిపోవడం లాంటి అంశాల ప్రభావం కనిపిస్తోందని తెలిపారు. దేశంలోని అనే నగరాల్లో సీజనల్ ఫ్లూ, ఇతర వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతుండడం కూడా కరోనా వ్యాప్తికి కారణం కావొచ్చన్నారు. వ్యాప్తి తక్కువ అయినప్పటికీ అలెర్ట్గా ఉండాలని కేంద్రం సూచిస్తోంది.
ఇదిలావుంటే.. దాదాపు 43శాతం కేసులతో కేరళ టాప్ ప్లేస్లో ఉండగా.. 21శాతం కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో..ఢిల్లీ, గుజరాత్ , తమిళనాడు ఉన్నాయి. కేరళను కరోనా కేసులు మరోసారి వణికిస్తు్న్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 519 కేసులు నమోదు అయినట్లు, మూడు మరణాలు సంభవించినట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. కేసులు పెరుగుదలతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్. ఈ సందర్భంగా.. కేసుల పెరుగుదలతో అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో కరోనా టెస్టులు వేగవంతం చేయాలన్నారు.
Also Read : Elon Musk-Trump : ఎలాన్ మస్క్, ట్రంప్ ల మధ్య తెగిన స్నేహ బంధం