Deepika Padukone : జ్యూరీ మెంబ‌ర్ గా దీపికా ప‌దుకొనే

భార‌తీయ న‌టికి అరుదైన గౌర‌వం

Deepika Padukone : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టి దీపికా ప‌దుకొనేకు అరుదైన గౌర‌వం ల‌భించింది. ఊహించ‌ని అవ‌కాశం ఆమె త‌లుపు త‌ట్టింది. ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తారు సినీ రంగానికి చెందిన వారంతా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఎంపిక కావ‌డం.

మ‌రి ఆ ఎంపిక చేసే జ్యూరీ క‌మిటీలో అనుకోకుండా చాన్స్ ద‌క్కితే అంత‌క‌న్నా అదృష్టం ఏముంటుంది క‌దూ. తాజాగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న భార‌తీయులు, ప్ర‌ధానంగా సినీ అభిమానులు వావ్ అంటున్నారు.

కాన్స్ చ‌ల‌న చిత్రోత్స‌వాల్లో దీపికా ప‌దుకొనే జ్యూరీ మెంబ‌ర్ గా ఎంపిక‌య్యారు. ఫ్రెంచ్ న‌టుడు విన్సెంట్ లిండెన్ ఈ జ్యూరీకి అధ్య‌క్ష‌త వ‌హిస్తారు. ఇందులో భార‌తీయ సినీ న‌టి దీపికా ప‌దుకొనేతో(Deepika Padukone )పాటు ఎనిమిది మంది న‌టీ న‌టులు, ద‌ర్శ‌కులు జ్యూరీలో ఉంటారు.

కాన్స్ చ‌ల‌న చిత్రోత్స‌వాలు జ‌రుపు కోవ‌డం వ‌రుస‌గా ఇది 75వ సారి. వ‌చ్చే మే నెల 10 నుంచి 28 దాకా కొన‌సాగుతాయి. జ్యూరీ మెంబ‌ర్స్ కీల‌క పాత్ర పోషిస్తారు. ఈ ఉత్స‌వాల‌లో మొత్తం 21 చిత్రాలు ఎంపిక‌య్యాయి.

ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన చిత్రాల‌లోంచి వీటిని ఫైన‌ల్ చేశారు. మే 28న అంగ‌రంగ వైభ‌వంగా అవార్డుల ప్ర‌దానోత్స‌వం జ‌ర‌గ‌నుంది. విచిత్రం ఏమిటంటే 2010 నుంచి దీపికా ప‌దుకొనే కాన్స్ సిటీలో జ‌రిగే చిత్రోత్స‌వాల‌లో పాల్గొంటూ వ‌స్తున్నారు.

ప్ర‌స్తుతం జ్యూరీ స‌భ్యురాలిగా ఎంపికై విస్తు పోయేలా చేశారు. దీంతో దీపికా ప‌దుకొనే అభిమానుల‌తో పాటు సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు, న‌టీ న‌టులు, ద‌ర్శ‌కులు ప్ర‌త్యేకంగా అభినందిస్తున్నారు.

Also Read : ర‌వితేజ వార‌సుడొచ్చేస్తున్నాడు

Leave A Reply

Your Email Id will not be published!