Deputy CM Pawan Kalyan : పర్యావరణ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తాం

పర్యావరణ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేద్దామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు...

Pawan Kalyan : కోటి మొక్కలు నాటి.. వాటిని సంరక్షించడమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అడవిలో కార్చిచుల నివారణకు, పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తానని అన్నారు. మానవ జీవితంలో ప్రకృతికి ఎంతో ప్రాధాన్యం ఉందని తెలిపారు. ఒకప్పుడు ఇంటి చిరునామాకు మొక్కలు, చెట్లు ఆనవాళ్లుగా ఉన్నాయని వెల్లడించారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు కానీ, ప్రకృతిని ప్రేమించే వ్యక్తి మనకు సీఎంగా ఉన్నారని ఉద్ఘాటించారు పవన్ కల్యాణ్.

Pawan Kalyan Comments

పర్యావరణ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేద్దామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ(గురువారం) అనంతవరంలోని ఏడీసీఎల్‌ పార్క్‌లో వనమహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, మంత్రులు, హాజరయ్యారు. అనంతవరం పార్క్‌ సమీపంలో రాగి, వేప మొక్కలను చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ నాటారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కోటి మొక్కలు నాటాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారాయణ, కందుల దుర్గేష్, ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రమాణం చేశారు.

Also Read : BSF Jawan Kidnapped : బీఎస్ఎఫ్ జవాన్ ను కిడ్నాప్ చేసిన బంగ్లాదేశీయులు

Leave A Reply

Your Email Id will not be published!