Deepti Sharma : వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోలేదు – దీప్తి శర్మ
ఇంగ్లండ్..భారత జట్ల మధ్య మన్కడ్ దుమారం
Deepti Sharma : భారత మహిళా క్రికెట్ లో ఇప్పుడు మన్కడ్ వ్యవహారం తీవ్ర దుమారానికి దారి తీసింది. భారత, ఇంగ్లండ్ జట్ల మధ్య జరిగిన కీలక మ్యాచ్ లో మహిళా క్రికెటర్, బౌలర్ దీప్తి శర్మ(Deepti Sharma) వార్తల్లో నిలిచారు.
నాన్ స్ట్రైకర్స్ ఎండ్ లో ఉన్న ఇంగ్లండ్ క్రికెటర్ చార్లీ డీన్ ను రనౌట్ చేసింది. లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.
కొందరు దీప్తి శర్మ మన్కడ్ పద్దతిన రనౌట్ చేయడం సరైనదేనంటూ సపోర్ట్ చేస్తుండగా మరికొందరు ఇది క్రికెట్ ఆటకు పూర్తి విరుద్దమంటూ కామెంట్ చేస్తున్నారు.
ఈ మొత్తం ఘటనపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకోవడంతో తీవ్రంగా స్పందించింది క్రికెటర్ దీప్తి శర్మ(Deepti Sharma). ఏ చర్చకైనా తాను సిద్దంగా ఉన్నట్లు ప్రకటించింది.
చార్లీ డీన్ మైదానంలోకి వచ్చినప్పటి నుంచి తనతో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ క్రీజు దాటవద్దంటూ చెప్పామని తెలిపింది. అయినా పట్టించు కోలేదు.
ఆపై వినిపించు కోలేదన్నారు దీప్తి శర్మ. ఇదే విషయం గురించి నిర్ణయం తీసుకునే అంపైర్లకు కూడా తెలియ చేశామని తెలిపారు. తాము ఏది చేసినా నియమాలు, నిబంధనల ప్రకారమేనని స్పష్టం చేశారు.
వినిపించు కోక పోవడం వల్లనే ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పింది దీప్తి శర్మ. అందుకే రనౌట్ చేయాల్సి వచ్చిందన్నారు. ఇదిలా ఉండగా దీప్తి శర్మ చేసిన రనౌట్ ను పూర్తిగా సమర్థించారు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.
వేరే మార్గం లేక పోవడం వల్లనే ఇలా చేయాల్సి వచ్చిందన్నారు. కావాలని మాత్రం కాదన్నారు. ఒకవేళ తాము చేసింది తప్పైతే అంపైర్లు ఎలా ఔట్ నిర్ణయిస్తారని ప్రశ్నించారు కెప్టెన్.
Also Read : సూర్య సూపర్ కోహ్లీ వండర్ – ద్రవిడ్