MP Raja : కేంద్ర మంత్రి అమిత్ షా పై భగ్గుమన్న డీఎంకే ఎంపీ రాజా

తమిళ ప్రజలు తప్పుడు ఆరోపణలను నమ్ముతారని కేంద్ర హోంమంత్రి భావించినట్టు కనిపిస్తున్నదన్నారు...

MP Raja : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తప్పుడు ఆరోపణలు చేస్తూ, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని డీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి, లోకసభ సభ్యుడు ఎ.రాజా(MP Raja) ఆరోపించారు. మదురైలో జరిగిన బహిరంగ సభలో ఆయన హోదాను మరిచి డీఎంకేపై అసత్య విమర్శలు చేయడం తగదని అన్నారు.

MP Raja Slams

చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, మదురై సభలో అమిత్‌షా(Amit Shah) ఇచ్చిన ప్రసంగం రాష్ట్ర ప్రభుత్వాన్ని బెదిరించే లక్ష్యంతో చేశారని వ్యాఖ్యానించారు. తమిళ ప్రజలు తప్పుడు ఆరోపణలను నమ్ముతారని కేంద్ర హోంమంత్రి భావించినట్టు కనిపిస్తున్నదన్నారు.

డీఎంకే శాసనసభ ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న హామీలన్నింటినీ ముఖ్యమంత్రి స్టాలిన్‌ నెరవేర్చడమే కాకుండా, చెప్పని అనేక హామీలను కూడా అమలు చేశారని తెలిపారు. డీఎంకే పాలనపై బహిరంగ చర్చకు అమిత్‌షా సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు.

ఒక రాష్ట్రానికి వెళ్లినప్పుడు కేంద్ర హోంమంత్రి తన హోదాను మరిచి, అక్కడి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయడం అంగీకారయోగ్యం కాదన్నారు. మదురై సభలో చేసిన ప్రసంగం రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉందని విమర్శించారు.

కేంద్రం రాష్ట్రంతో సఖ్యతతో ఉండాల్సిన సమయంలో, అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు కేంద్ర–రాష్ట్ర సంబంధాలకు గండికొడుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో పలు కీలక పథకాలకు కేంద్రం నిధులు ఇవ్వకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం వాటిని తన సొంత నిధులతో అమలు చేస్తోందన్నారు. అటువంటి పరిస్థితుల్లో కేంద్రం భారీగా నిధులు మంజూరు చేసిందన్న ప్రకటన హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.

అమిత్‌షా రాకతో డీఎంకే నాయకులు భయపడుతున్నారని బీజేపీ నేతల వ్యాఖ్యలపై కూడా రాజా మండిపడ్డారు. డీఎంకేను చూసి భయపడే పరిస్థితి తమకు లేదని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో తమిళ ప్రజలు డీఎంకేకు సంపూర్ణ మద్దతు తెలపగా, బీజేపీ నాయకులు ఆ విషయాన్ని మరిచిపోయినట్టుగా ఉందన్నారు.

అమిత్‌షా తమిళ భాషపై ప్రేమ ఉందని చెబుతున్నప్పటికీ, కీళడి తవ్వకాలపై వచ్చిన రెండు నివేదికలను ఎందుకు అంగీకరించడం లేదో చెప్తారా అని ప్రశ్నించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శలు చేసిన అమిత్‌షా, ముందు మణిపూర్‌ పరిస్థితులను స్వయంగా వెళ్లి చూడాలని సూచించారు. చివరిగా, 2026లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రకటించిన అమిత్‌షా వ్యాఖ్యలపై, అన్నాడీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి స్పందించాలని డిమాండ్‌ చేశారు.

Also Read : Vijay -TVK Party : హీరో విజయ్ టీవీకే పార్టీలో మాజీ ఐఆర్ఎస్ అధికారి అరుణ్ రాజ్

Leave A Reply

Your Email Id will not be published!