KA Paul KCR : దేవుడి దూత‌ను న‌న్ను చంప‌లేరు

ప్ర‌జా శాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్

KA Paul KCR : ప్ర‌జాశాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను దేవుడి దూత‌న‌ని త‌న‌ను ఎవ‌రూ అంతం చేయ‌లేర‌న్నారు. కేఏ పాల్ మ‌రోసారి బీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు(KA Paul KCR). ఏపీ నుంచి విడి పోయిన స‌మ‌యంలో తెలంగాణ మిగులు బ‌డ్జెట్ తో ఉండేద‌ని కానీ ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప‌గా మార్చారంటూ ఆరోపించారు. ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌ను ఒక్క‌టి కూడా అమ‌లు చేయ‌లేద‌న్నారు.

త‌న‌పై పాత కేసుల‌ను తిర‌గ దోడుతున్నారంటూ మండిప‌డ్డారు. అయినా ప్ర‌జ‌లు త‌న వైపు ఉన్నంత వ‌ర‌కు సీఎం త‌న‌ను ముట్టుకోలేర‌న్నారు. గ‌తంలో కొంద‌రు త‌న‌ను చంపాల‌ని చూశార‌ని కానీ వాళ్ల‌కు చేత కాలేద‌న్నారు కేఏ పాల్. త‌న‌ను రాజ‌కీయంగా ఎదుర్కోలేక‌నే కేసులు న‌మోదు చేస్తున్నారంటూ ఆరోపించారు. ఇది పూర్తిగా క‌క్ష సాధింపు చ‌ర్య త‌ప్ప మ‌రొక‌టి కాద‌న్నారు ప్ర‌జా శాంతి పార్టీ చీఫ్‌(KA Paul).

త‌న‌పై న‌మోదు చేసిన కేసుల విష‌యానికి సంబంధించి సుప్రీంకోర్టులో స‌వాల్ చేస్తాన‌ని చెప్పారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది పూర్త‌య్యే లోపు సీఎం కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ ఖాళీ చేయ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు కేఏ పాల్. కామారెడ్డి రైతుల‌కు తాను న్యాయం చేశాన‌న్న క‌క్ష‌తో త‌న‌ను ఇబ్బంది పెట్టాల‌ని చూస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు.

బీఆర్ఎస్ పాల‌న‌లో అవినీతి త‌ప్ప ఏమీ లేద‌న్నారు. ల‌క్ష‌ల కోట్లు ఎవ‌రి కోసం అప్పులు తీసుకు వ‌చ్చారో చెప్పాల‌ని కేఏ పాల్ డిమాండ్ చేశారు. సీఎంపై కేసు న‌మోదు చేయాల‌ని అన్నారు.

Also Read : లైఫ్ సైన్స్ రంగంలో హైద‌రాబాద్ టాప్

Leave A Reply

Your Email Id will not be published!