Eatala Rajender : ఈటలను రాష్ట్ర అధ్యక్షుడి పదవి వరించనుందా..?

ఆయనను బుజ్జగించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఈటలకు అప్పగిస్తున్నట్లు సమాచారం...

Eatala Rajender : కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో పలువురు రాష్ట్ర ఎంపీలకు మంత్రి పదవులు దక్కాయి. తెలంగాణలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ లకు కేంద్ర మంత్రి పదవులు కట్టబెట్టారు. దీంతో కేంద్ర ప్రభుత్వ పదవిపై ఆశలు పెట్టుకున్న మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు నిరాశే మిగిలింది. ఆయనను బుజ్జగించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఈటలకు అప్పగిస్తున్నట్లు సమాచారం.

Eatala Rajender…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తప్పించి కిషన్‌రెడ్డిని నియమించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములై రాష్ట్రంలో పార్టీ పగ్గాలు చేపట్టాలని మోదీ-షా ద్వయం భావిస్తున్నది. మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్న ఈటలను కూల్ చేసెందుకే బీజేపీ నాయకత్వం అధ్యక్ష పదవి ఇస్తున్నట్టు ప్లాన్‌గా కనిపిస్తోంది.

Also Read : Kishan Reddy : కేంద్ర మంత్రి పదవులపై సంచలన వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి

Leave A Reply

Your Email Id will not be published!