Ex MP Adilabad : ఆదిలాబాద్ ఎంపీ బీజేపీ నేత రమేష్ రాథోడ్ కన్నుమూశారు

రమేష్ రాథోడ్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు...

Ex MP Adilabad : బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. అతనికి 58 సంవత్సరాలు. శనివారం తెల్లవారుజామున ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా తుదిశ్వాస విడిచారు. రమేష్ రాథోడ్ శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. కుటుంబసభ్యులు అతడిని స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే శనివారం ఉదయం కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఆ క్రమంలోనే ఆయన కన్నుమూశారు.

Ex MP Adilabad No More

రమేష్ రాథోడ్ ఖానాపూర్ ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. తెలుగుదేశం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు రమేష్ రాథోడ్ కీలక నేతగా పనిచేశారు. ఆయన స్వస్థలం నార్నూల్ మండలం తాడిహత్నూర్.

Also Read : Buddha Venkanna TDP : విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి ఘనంగా సన్మానం చేసిన బుద్ధా వెంకన్న

Leave A Reply

Your Email Id will not be published!