S Jaishankar : ఇస్లామాబాద్ షాంగై సమావేశానికి భారత విదేశాంగ మంత్రి

ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ రొటేటింగ్ చైర్మన్‌షిప్ ఈసారి పాకిస్థాన్‌కు వచ్చింది...

S Jaishankar  : ఇస్లామాబాద్‌లో జరగనున్న షాంఘే కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొనేందుకు భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్(S jaishankar) పాకిస్థాన్ వెళ్తున్నారు. ఎస్‌సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశాలు ఈనెల 15,16 తేదీల్లో జరుగనున్నాయి. ఈ సమావేశాలకు పాక్ నుంచి ఆహ్వానం అందినట్టు గత ఆగస్టు 30న ఒక ప్రకటనలో భారత్ ధ్రువీకరించింది. 2015 డిసెంబర్ అనంతరం భారత విదేశాంగ మంత్రి పాకిస్థాన్‌కు వెళ్లడం ఇదే మొదటిసారి. దివంగత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ 2015లో ఆప్ఘనిస్థాన్‌లో కాన్ఫరెన్స్ కోసం ఇస్లామాబాద్‌లో పర్యటించారు. ఎస్సీఓ కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ రొటేటింగ్ చైర్మన్‌షిప్ ఈసారి పాకిస్థాన్‌కు వచ్చింది. శిఖరాగ్ర సమావేశానికి ముందు మంత్రి వర్గ సమావేశం, ఎస్‌సీఓ సభ్య దేశాల మధ్య ఆర్థిక, సామాజిక సంస్కృతి, మానవతా సహాయంపై దృష్టి సారించేందుకు సీనియర్ అధికారుల సమావేశాలు జరుగనున్నాయి.

S Jaishankar Visit…

రష్యా, చైనా, క్రిజిగ్ రిపబ్లిక్, కజకిస్థా్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ అధ్యక్షులతో 2001లో షాంఘైలో జరిగిన సమావేశంలో ఎస్ఈఓ ‌ఏర్పాటైంది. 2017లో ఇండియా, పాకిస్థాన్ శాశ్వత సభ్యులయ్యారు. గత జూలైలో ఎస్‌సీఓకు సదస్సుకు భారతదేశం ఆతిథ్యం ఇచ్చింది. వర్చువల్ మీట్ నిర్వహించింది. ఇందులో పాకిస్థాన్ ప్రధాని ప్రధానమంత్రి షెహబాజ్ షరీప్ పాల్గొన్నారు. ఇదే సమావేశంలో ఇరాన్‌కు శాశ్వత సభ్యత్వం ప్రకటించారు.

Also Read : Minister Payyavula : మాజీ సీఎం జగన్ కు శ్రీనివాసుని కోసం మాట్లాడే హక్కు లేదు

Leave A Reply

Your Email Id will not be published!