Gadwal MLA : సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్

గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు...

Gadwal MLA : గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గత నెలలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సమావేశం కావడంతో తిరిగి ఆ పార్టీలో చేరతారా అనే సందేహాలు వచ్చాయి. ఆ వెంటనే మంత్రి జూపల్లి కృష్ణారావు రంగంలోకి దిగారు. బండ్లతో చర్చలు జరిపి, సీఎం రేవంత్ రెడ్డి వద్దకు తీసుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(Gadwal MLA)ని మంత్రి జూపల్లి కృష్ణారావు తీసుకొచ్చారు. సీఎంతో భేటీ తర్వాత బండ్ల భవిష్యత్ కార్యాచరణ తెలియనుంది. బండ్లకు నామినేటెడ్ పదవి, లేదంటే నియోజకవర్గానికి నిధులపై హామీ ఇస్తారని తెలుస్తోంది.

Gadwal MLA Meet..

గద్వాల నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నిన్న బండ్లను కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. గద్వాల రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దుతామని మంత్రి జూపల్లి.. బండ్లకు హామీనిచ్చారు. జూపల్లి భరోసా ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని బండ్ల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కేటీఆర్, ఇతర నేతలతో బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి మంచి అనుబంధం ఉందని జూపల్లి బీఆర్ఎస్ పార్టీని వీడి జూలై 6వ తేదీన బండ్ల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇటీవల కేటీఆర్‌ను కలువడంతో రాజకీయంగా దుమారం చెలరేగింది. దాంతో కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. బండ్లతో చర్చలు జరిపి, పార్టీలో కొనసాగాలని కోరినట్టు సమాచారం.

Also Read : CM Chandrababu : ఒక్క రోజులో 97 శాతం పింఛన్ల పంపిణీ పై సంతృప్తి వ్యక్తం చేసిన బాబు

Leave A Reply

Your Email Id will not be published!