Gujarat CM : పేరెంట్స్ పర్మిషన్ ఉంటేనే ప్రేమ పెళ్లిళ్లు
గుజరాత్ సీఎం పటేల్ షాకింగ్ కామెంట్స్
Gujarat CM : గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి ప్రేమ వివాహాలు చేసుకోవాలంటే తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ప్రేమ పెళ్లిళ్లకు పేరెంట్స్ అనుమతి తప్పనిసరి చేసే వ్యవస్థను తీసుకు వచ్చేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
Gujarat CM Changes
రాజ్యాంగ బద్దంగా సాధ్యమైతే ఈ ప్రతిపాదనను అమలు లోకి తీసుకు వస్తామని ప్రకటించారు భూపేంద్ర పటేల్. పాటీదార్ సామాజిక వర్గం అత్యధిక ప్రభావం చూపిస్తోంది గుజరాత్ లో. పాటీదార్ కు చెందిన సర్దార్ పటేల్ గ్రూప్ మెహ్సానాలో కీలక సమావేశం నిర్వహించింది. ఈ మీటింగ్ కు ముఖ్య అతిథిగా సీఎం భూపేంద్ర పటేల్ హాజరయ్యారు.
ఇదిలా ఉండగా పాటీదార్ వర్గం నుండి వస్తున్న డిమాండ్లకు అనుగుణంగా ఈ వ్యాఖ్యలు చేశారు సీఎం. భూపేంద్ర పటేల్(Gujarat CM) చేసిన కామెంట్స్ పై ఇతర సామాజిక వర్గాలు మండి పడుతున్నాయి. ముఖ్యంగా యువత భగ్గుమంటోంది. తమ ప్రేమ పెళ్లిళ్లకు ఇంకొకరి పర్మిషన్ ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదంటున్నారు.
కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని గుజరాత్ లోని బీజేపీ సర్కార్ ఇలాంటి చవకబారు కామెంట్స్ చేస్తోందంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. మొత్తంగా పటేల్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారడం విశేషం.
Also Read : BRO Movie Team Visit : దుర్గమ్మ సన్నిధిలో బ్రో టీమ్