Minister Anitha : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి

రాష్ట్రవ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక కృషి చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు...

Minister Anitha : తెలుగుదేశం నాయకురాలు, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. చీరాలలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఘటన జరిగిన 48 గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేశారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Minister Anitha Visited

రాష్ట్రవ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేక కృషి చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. 100 రోజుల్లో గంజాయి, డ్రగ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, సంకీర్ణ ప్రభుత్వంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు.

Also Read : MLA Jagadish Reddy : విద్యుత్ కమిషన్ నుంచి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి లేఖ

Leave A Reply

Your Email Id will not be published!