Hyderabad : హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటున్న దక్షిణ భారత అడ్వకాట్

హైదరాబాద్ లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలంటున్న దక్షిణ భారత అడ్వకాట్..

Hyderabad : సుప్రీంకోర్టు సౌత్‌ ఇండియా రీజినల్‌ బెంచ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని దక్షిణ భారత అడ్వకేట్‌ జేఏసీ అధ్యక్షుడు సుధా నాగేందర్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే డిమాండ్‌తో దక్షిణ భారత అడ్వకేట్‌ జేఏసీ ఆధ్వర్యంలో ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా పాలకులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు.

Hyderabad Supreme Court..

బుధవారం నల్లకుంటలోని కార్యాలయంలో సుప్రీంకోర్టు న్యాయవాది వినాయక్‌రావు, హైకోర్టు న్యాయవాది భూపాల్‌రాజ్‌లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు రీజినల్‌ బెంచ్‌ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 10న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నల్లకుంటలోని దక్షిణ భారత అడ్వకేట్‌ జేఎసీ కార్యాలయంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. సమావేశానికి సుప్రీంకోర్టు న్యాయ వాదులు, మేధావులు, పలువురు ప్రముఖులు హాజరవుతారని ఆయన తెలిపారు.

Also Read : CM Chandrababu : స్పెషల్ ఫ్లైట్ లో రతన్ టాటా పార్థివదేహానికి నివాళులర్పించేందుకు బాబు

Leave A Reply

Your Email Id will not be published!