Surya Kumar Yadav 2nd T20 : సెంచ‌రీతో క‌దం తొక్కిన సూర్య

192 ప‌రుగుల భారీ టార్గెట్

Surya Kumar Yadav 2nd T20 : న్యూజిలాండ్ టూర్ లో భాగంగా టి20 రెండో మ్యాచ్ లో స్టార్ హిట్ట‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ దుమ్ము రేపాడు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. టాస్ ఓడి పోయి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భార‌త జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 191 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది.

వ‌ర్షం మ‌ధ్యలో ఆటంకం క‌లిగించినా ఆ త‌ర్వాత మ‌రోసారి ప్రారంభ‌మైంది. ఇక బీసీసీఐ ఎంతో న‌మ్మ‌కం ఉంచిన రిష‌బ్ పంత్ మ‌రోసారి నిరాశ ప‌రిచాడు. 13 బంతులు ఎదుర్కొని 6 ప‌రుగులు చేశాడు. ఇదే స‌మ‌యంలో మైదానంలోకి వ‌చ్చిన సూర్య కుమార్ యాద‌వ్(Surya Kumar Yadav) దంచి కొట్టాడు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

కేవ‌లం 49 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న సూర్య భాయ్ ఏకంగా 111 ప‌రుగులు చేశాడు. దీంతో టీమిండియా స్కోర్ ప‌రుగులు తీసింది. సూర్య కుమార్ యాద‌వ్ త‌న టి20 కెరీర్ లో ఇది రెండో సెంచ‌రీ కావ‌డం విశేషం. సెంచ‌రీలో భాగంగా మొద‌టి హాఫ్ సెంచ‌రీని కొట్టేందుకు 32 బంతులు వాడాడు.

మ‌రో హాఫ్ సెంచ‌రీని కేవ‌లం 17 బంతులు మాత్ర‌మే ఆడాడు. ఇదిలా ఉండ‌గా మొద‌టి మ్యాచ్ వ‌ర్షార్ఫ‌ణం అయ్యింది. దీంతో మ్యాచ్ ను ర‌ద్దు చేశారు. రెండో మ్యాచ్ కు వ‌ర్షం అంత‌రాయం క‌లిగించినా ఆ త‌ర్వాత కంటిన్యూ అయ్యింది. ఇదే క్ర‌మంలో ఓపెన‌ర్లుగా ఇషాన్ కిష‌న్ , రిష‌బ్ పంత్ వ‌చ్చారు.

ఇషాన్ కిషాన్ 36 ప‌రుగులు చేసి ప‌ర్వాలేద‌ని అనిపించాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్ 13 ప‌రుగుల‌కే చాప చుట్టేశాడు. ఇదిలా ఉండ‌గా సంజూ శాంస‌న్ ను తీసుకోక పోవ‌డంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Also Read : న్యూజిలాండ్ పై భార‌త్ ఘ‌న విజ‌యం

Leave A Reply

Your Email Id will not be published!