IND vs NZ 2nd T20 : టీమిండియా కీవీస్ బిగ్ ఫైట్
లక్నోలో కీలక రెండో టీ20 మ్యాచ్
IND vs NZ 2nd T20 : భారత ,న్యూజిలాండ్ జట్ల మధ్య కీలకమైన టీ20 రెండో మ్యాచ్ లక్నోలో జనవరి 29న ఆదివారం జరగనుంది. ఇప్పటికే తొలి టీ20 మ్యాచ్ లో కీవీస్ చేతిలో 21 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పటికే స్వదేశంలో మూడు వన్డే మ్యాచ్ ల సీరీస్ ను కోల్పోయింది న్యూజిలాండ్ .
భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. అయితే ఊహించని రీతిలో టీ20 మ్యాచ్ లో(IND vs NZ 2nd T20) విక్టరీ సాధించి పరువు పోకుండా కాపాడుకుంది. ఈ తరుణంలో టీ20 సీరీస్ ను నిర్ణయించే కీలక మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఇందులో ఎవరు గెలిస్తే వారిదే సీరీస్ వశమవుతుంది.
కాగా ఈ మ్యాచ్ లో టాస్ దే కీలక పాత్ర పోషిస్తుంది. లక్నో మైదానంలో ఎక్కువ మ్యాచ్ లు గెలుపొందిన రికార్డు భారత్ పై ఉంది. ఇక టీమిండియా, కీవీస్ మధ్య రాత్రి 7 గంటలకు అటల్ బిహారీ వాజ్ పేయి స్టేడియంలో ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ లో తప్పక గెలవాలని భారత్ డిసైడ్ అయ్యింది.
బలమైన బ్యాటింగ్ లైనప్ తో పాటు బౌలింగ్ పరంగా కూడా పటిష్టమైన స్థితిలో ఉంది టీమిండియా. శుభ్ మన్ గిల్ , ఇషాన్ కిషన్ , సూర్య కుమార్ యాదవ్ , వాషింగ్టన్ సుందర్ , హార్దిక్ పాండ్యా కీలకంగా మారనున్నారు.
విచిత్రం ఏమిటంటే లక్నోలో ఇప్పటి వరకు 5 మ్యాచ్ లు జరిగితే ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధిస్తూ వచ్చింది. ఇక న్యూజిలాండ్ జట్టులో కాన్వే, మిచెల్ రాణించడం ఆ జట్టుకు ఒకింత మేలేనని భావిస్తోంది.
Also Read : భారత్ కు షాక్ కీవీస్ సక్సెస్