Indian Navy: పాక్ సిబ్బందికి సహాయం అందించిన ఇండియన్ నేవీ సిబ్బంది

పాక్ సిబ్బందికి సహాయం అందించిన ఇండియన్ నేవీ సిబ్బంది

Indian Navy : అరేబియా సముద్రంలో ఆపదలో ఉన్న పాకిస్తాన్ సిబ్బందికి అత్యవసర వైద్యం అందించి మానవత్వం చాటుకున్నారు ఇండియన్ నేవీ(Indian Navy) సిబ్బంది. మూడు గంటల పాటు శ్రమించి… ఆపరేషన్ చేసిన ఇండియన్ నేవీ వైద్య సిబ్బంది… పాకిస్తాన్(Pakistan) సిబ్బంది ప్రాణాలు కాపాడారు. ఇండియన్ నేవీ చేసిన సాయానికి… వారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. దేశ సరిహాద్దులు, రాజకీయాల వరకే దాయాది దేశాల మద్య వైరం తప్ప… మానవత్వంలో కాదని భారత నావికాదళం సిబ్బంది నిరూపించారు. ఇండియన్ నేవీ(Indian Navy) సిబ్బంది వెల్లడించిన సమాచారం ప్రకారం… మూడు రోజుల క్రితం అనగా ఏప్రిల్ 4 అనగా శుక్రవారం నాడు… ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Indian Navy Helps..

మధ్య అరేబియా సముద్రంలో షిప్ లో విధులు నిర్వహిస్తున్న పాకిస్తాన్(Pakistan) కు చెందిన ఓ నావికుడు వేళ్ళకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంజిన్ పై పనిచేస్తున్నప్పుడు దోలో ఉన్న పాక్ నావికుడి చేతివేళ్ళు పూర్తిగా తెగి… తీవ్రంగా రక్త స్రావం అయింది. దీనితో వెంటనే వైద్య సహాయం కావాలని ఇరానియన్ ఫిషింగ్ దో నుంచి సమాచారం పంపించారు. అంతేకాక గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. బాధితుడిని.. అప్పటికే ఇరాన్ వైపు వెళ్తున్న మరొక ఇరానియన్ ఫిషింగ్ నౌక ఎఫ్‌వీ అబ్దుల్ రెహ్మాన్ హంజియాకు తరలించారు. అయితే ఆ సమయంలో భారత నావికాదళానికి చెందిన ఫ్రంట్‌లైన్ యుద్ధనౌక ఐఎన్‌ఎస్ త్రికాండ్ నౌక ఒమన్ తీరానికి దాదాపు 350 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. ఈ సమాచారాన్ని అందుకున్న ఐఎన్‌ఎస్ త్రికాండ్ నౌక సిబ్బంది… అత్యవసర వైద్య సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇరానియన్ ఫిషింగ్ దో నుంచి వచ్చిన సందేశాన్ని అందుకుని… తన మార్గాన్ని మార్చుకున్నారు. గాయపడిన సిబ్బందిని తరలిస్తున్న ఎఫ్‌వీ అబ్దుల్ రెహమాన్ హంజియా నౌక వద్దకు చేరుకుని వైద్య సహాయం అందించారు.

గాయపడిన పాక్ సిబ్బందికి వైద్యం అందించడం కోసం… ఐఎన్ఎస్ త్రికాండ్ వైద్య అధికారి, మార్కోస్ (మెరైన్ కమాండోలు), ఓడ బోర్డింగ్ సిబ్బంది… ఇరానీయన్ ఓడలోకి చేరుకున్నారు. ఆ తర్వాత గాయపడిన వ్యక్తికి అనస్థీషియా ఇచ్చి అతడి వేళ్లకు కుట్లు వేశారు. సుమారు మూడు గంటలకు పైగా శస్త్రచికిత్స కొనసాగింది. సకాలంలో స్పందించడం వలన చేతి వేళ్లను తొలగించే ప్రమాదం తప్పిందని వెల్లడించారు. మార్గమధ్యంలో గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమిస్తే… ఆ సమయంలో వినియోగించాల్సిన యాంటీబయాటిక్స్‌తో పాటు వైద్య సామాగ్రాని అందించారు. ఇక ఇండియన్ నేవీ(ఇండియన్ నేవీ) సిబ్బంది చేసిన సాయానికి.. ఇరానియన్ ఫిషింగ్ నౌకలో ఉన్న మొత్తం సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.

ఇరానియన్ ఫిషింగ్ నౌక ఉన్న సిబ్బందిలో 11 మంది పాకిస్తానీలు (తొమ్మిది మంది బలూచ్, ఇద్దరు సింధీ)కాగా మరో ఐదుగురు ఇరానియన్ సిబ్బంది. ప్రమాదంలో పాకిస్తాన్ క్రూ మెంబర్‌కి అనేక చోట్ల ఫ్రాక్షర్స్ కావడం మాత్రమే కాక… చేతికి తీవ్ర గాయం అయ్యింది. రక్తస్రావం అయ్యింది. దీనితో మేము హుటాహుటీన అక్కడకు చేరుకుని వారికి వైద్య సహాయం అందించామని… ఇండియన్ నేవీకు చెందిన ఐఎన్ఎస్ త్రికాండ్ వైద్య అధికారి తెలిపారు.

పాకిస్తాన్, ఇండియా రెండు దాయాది దేశాల మధ్య పరిస్థితులు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటాయి. భారత్ ఎంత శాంతియుతంగా ఉందామని భావించినా… పాక్ మాత్రం తన వక్రబుద్ధిని బయటపెడుతూనే ఉంటుంది. సందు దొరికితే చాలు కయ్యానికి కాలు దువ్వుతూనే ఉంటుంది. ఇక ఇరు దేశాల సరిహద్దుల వద్ద పరిస్థితులు యుద్ధ వాతావారణాన్ని గుర్తు చేస్తాయి. అయితే పాక్‌ తో భారత్ వైరం… ఆ దేశ సరిహద్దులు, నేతలతో ముడిపడి ఉంటుంది తప్ప పాక్ ప్రజలతో కాదు అని ఈ ఘటన నిరూపించింది.

Also Read : Ananth Ambani: ద్వారకలో ముగిసిన అనంత్‌ అంబానీ పాదయాత్ర

Leave A Reply

Your Email Id will not be published!