Indukuri Sudha Rani: భర్త వైసీపీలో… భార్య టీడీపీలో… ఎస్ కోటలో ఆశక్తికర రాజకీయాలు !
భర్త వైసీపీలో... భార్య టీడీపీలో... ఎస్ కోటలో ఆశక్తికర రాజకీయాలు !
Indukuri Sudha Rani: విజయనగరం జిల్లా శృంగవరపుకోట రాజకీయాలు ఆశక్తికరంగా మారాయి. వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరు రఘురాజు సతీమణి, ఎస్ కోట వైస్ ఎంపీపీ ఇందుకూరు సుధారాణి టీడీపీలో చేరారు. సుధారాణితో పాటు నియోజకవర్గానికి చెందిన సుమారు 150 మంది నాయకులు ప్రత్యేక వాహనాల్లో విజయవాడ వెళ్ళి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ(TDP) తీర్ధం పుచ్చుకున్నారు. టీడీపీలో చేరిన వారిలో 15 మంది సర్పంచులు, 17 మంది ఎంపీటీసీలు ఉన్నారు. అయితే ఇందుకూరి సుధారాణితో పాటు ఇతర నాయకుల చేరిక వైసీపీకు పెద్ద దెబ్బగా చెప్పుకోవచ్చు. మంత్రి బొత్స సత్యనారాయణ అనుచరుడిగా పేరుపొందిన రఘురాజు…. బొత్స భార్య ఝాన్సీ పోటీ చేస్తున్న విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎస్ కోట అసెంబ్లీ సెగ్మెంట్ లో టీడీపీను వీడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Indukuri Sudha Rani Political Party Viral
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ… జగన్ ఒంటెద్దు పోకడలు భరించలేక రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఖాళీ అవుతోందన్నారు. ఆ పార్టీలో ఇమడలేక చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీతో కలిసి పనిచేయాలనుకునే వారికి తలుపులు తెరిచే ఉంటాయన్నారు.
టీడీపీలో చేరిన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు, జిల్లా వైసీపీ నాయకులు బొత్స సత్యనారాయణలతో పాటు వైసీపీ అధిష్టానంపై ఇందుకూరి సుధారాణి(Indukuri Sudha Rani) సంచలన వ్యాఖ్యలు చేసారు. ఎస్ కోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు అవినీతి, భూ ఆక్రమలు ఎక్కువైపోయాయని ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతిపై జిల్లా నాయకులు, వైసీపీ అధిష్టానానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కమీషన్ లేకుండా ఎమ్మెల్యే ఏ పని చేయడం లేదని… స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు కనీస గౌరవం ఇవ్వకుండా అవమానాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కాబట్టి గౌరవం లేని చోట ఉండలేక… వైసీపీలో చేరినట్లు ప్రకటించారు.
అయితే ఎమ్మెల్సీ రఘురాజు వైసీపీలో కొనసాగుతుండగా… అతని భార్య సుధారాణి మాత్రం టీడీపీలో చేరడంతో ఎస్ కోట నియోజకర్గంలో రాజకీయాలు ఆశక్తికరంగా మారాయి. 2019 ఎన్నికలకు ముందు కడుబండి గెలుపుకు కృషి చేస్తే సముచిత స్థానం కల్పిస్తామని అప్పట్లో రఘురాజుకు… వైసీపీ అధినేత జగన్ హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల్లో కడుబండి గెలుపొందడంతో… ఎన్నికల తరువాత రఘురాజుకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే రఘురాజు ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య ఆధిపత్యపోరు జరుగుతోంది.
అది తారాస్థాయికి చేరుకుని ఒకరుపై మరొకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ… పార్టీ పెద్దలకు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్నారు. పార్టీ పెద్దలతో పాటు సాక్ష్యాత్తూ సీఎం జగన్ వారి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించినప్పటికీ… కుదరలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ రఘురాజు… తన భార్యను టీడీపీలోనికి పంపించినట్లు తెలుస్తోంది. రఘురాజు కూడా టీడీపీలో చేరితే… స్థానిక సంస్థల నుండి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో… ఎక్కడ ఆ పదవి పోతుందనే భయంతో తాను వైసీపీలో కొనసాగుతూ… భార్యను టీడీపీలోనికి పంపించినట్లు తెలుస్తోంది.
Also Read : BRS Party : బీఆర్ఎస్ ఆ 4 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన అధినేత కెసిఆర్