Journalist KSN : భారీ బందోబస్తుతో జర్నలిస్ట్ కొమ్మినేని మంగళగిరి కోర్టుకు
వైద్య పరీక్షలు ముగిసిన తరువాత భారీ బందోబస్తు నడుమ కొమ్మినేని మంగళగిరి కోర్టుకు తరలించారు...
Journalist KSN : ఏపీ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాస్ రావును ఈరోజు (మంగళవారం) మంగళగిరి కోర్టులో తుళ్లూరు పోలీసులు హాజరుపర్చారు. ఉదయం గుంటూరు జీజీహెచ్లో శ్రీనివాస్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు ముగిసిన తరువాత భారీ బందోబస్తు నడుమ కొమ్మినేని మంగళగిరి కోర్టుకు తరలించారు.
Journalist KSN to Mangalagiri Court
ఏపీ రాజధానిపై, రాజధాని మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్పై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసనలు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు పోలీస్స్టేషన్లో ఫిర్యాదులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో తుళ్లూరు పోలీస్స్టేషన్లో రాజధాని ప్రాంతం మహిళగా ఉన్న తెలుగు దేశం పార్టీ దళిత నాయకురాలు కొమ్మంపాటి శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా కృష్ణం రాజు, ఏ2గా కొమ్మినేని శ్రీనివాస్ రావు, ఏ3గా సాక్షా యాజమాన్యాన్ని చేర్చారు. కేసు నమోదు చేసిన తుళ్లూరు పోలీసులు నిన్న (సోమవారం) హైదరాబాద్లో ఏ2 కొమ్మినేని శ్రీనివాస్ను అదుపులోకి తీసుకుని సాయంత్రానికి గుంటూరుకు తీసుకొచ్చారు.
Also Read : Kerala Port : కేరళ పోర్టులో సింగపూర్ వాణిజ్య నౌక నుంచి భారీగా మంటలు