Junior NTR : ట్ర‌బుల్ షూట‌ర్ తో టార్చ్ బేర‌ర్ భేటీ

అమిత్ షా తో జూనియ‌ర్ ఎన్టీఆర్

Junior NTR : ఇరు తెలుగు రాష్ట్రాల‌లో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరొందిన కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో ప్ర‌ముఖ న‌టుడు టార్చ్ బేర‌ర్ గా పేరొందిన జూనియ‌ర్ ఎన్టీఆర్(Junior NTR) భేటీ అయ్యారు.

ఒక‌రు దేశ రాజ‌కీయాల‌ను ఒంటి చేత్తో శాసిస్తున్న దిగ్గ‌జ , త‌లపండిన రాజ‌కీయ నాయ‌కుడు అమిత్ షా అయితే మ‌రొక‌రు త‌న అసమాన న‌ట‌నా ప్ర‌తిభ‌తో అల‌రిస్తూ వ‌స్తున్న జూనియ‌ర్ ఎన్టీఆర్.

ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా మునుగోడు లో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు అమిత్ షా. అంత‌కు ముందు హైద‌రాబాద్ వ‌చ్చిన అమిత్ షా మ‌హంకాళి అమ్మ వారిని ద‌ర్శించుకున్నారు.

నోవా టెల్ లో కేంద్ర మంత్రితో తార‌క్ భేటీ అయ్యారు. ఈ స‌మావేశం సినీ, రాజ‌కీయ వ‌ర్గాల‌లో సంచ‌ల‌నం కలిగించింది. ఏం మాట్లాడార‌న్న దానిపై క్లారిటీ రాలేదు.

కానీ ఏ మాత్రం రాజ‌కీయ ప్ర‌యోజ‌నం అన్న‌ది లేకుండా అమిత్ షా ఎవ‌రినీ క‌లవ‌డు. అది జ‌గ‌మెరిగిన స‌త్యం. ద‌క్షిణాదిన ఎలాగైనా స‌రే అన్ని రాష్ట్రాల‌లో కాషాయ జెండా ఎగుర వేయాల‌న్న‌ది ల‌క్ష్యంగా పెట్టుకున్నారు అమిత్ షా.

ఆ మేర‌కు పావులు క‌దుపుతున్నారు. పైకి దర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ మూవీలో అద్భుతంగా న‌టించినందుకు ఎన్టీఆర్ ను అభినందించడానికే అని చెప్పినా లోప‌ల ఏదో ఒక మ‌త‌ల‌బు దాగి ఉంద‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం.

రాత్రి 10. 30 గంట‌ల స‌మ‌యంలో ఇద్ద‌రూ క‌లిసి భోజ‌నం చేశారు. బీజేపీలో చేరాల‌ని సముచిత స్థానం క‌ల్పిస్తానంటూ షా హామీ ఇచ్చిన‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read : అమిత్ షా ఏది చేసినా సంచ‌ల‌న‌మే

Leave A Reply

Your Email Id will not be published!