Kaleswaram Project : కాళేశ్వరంపై కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టిన మాజీ మంత్రి
4న కవిత ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ జాగృతి నిరసన తెలపనుంది...
Kaleswaram Project : కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ఆరోపణలకు బీఆర్ఎస్ కౌంటర్ సిద్ధం చేస్తోంది. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో మాజీమంత్రి హరీష్ రావు(Harish Rao) కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని బీఆర్ఎస్ అంటోంది. ఈనెల 5న విచారాణకు హాజరుకావాలని మాజీ సీఎం కేసీఆర్కు కమిషన్ నోటీసులిచ్చింది. అలాగే ఈనెల 9న కమిషన్ ముందుకు హాజరుకావాలని మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజంటేషన్కు ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఇప్పటికే కమిషన్కు ఇవ్వాల్సిన డేటాని బీఆర్ఎస్ సిద్ధం చేసింది. మరోవైపు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ.. 4న కవిత ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద తెలంగాణ జాగృతి నిరసన తెలపనుంది.
Kaleswaram Project-Harish Rao Comments
కాగా తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిపై విచారణకు హాజరు కావాలంటూ రెండు వారాల క్రితం జస్టిస్ చంద్ర ఘోస్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో అవినీతి, నిధుల దుర్వినియోగం, నిర్మాణంలో అవకతవకల ఆరోపణలపై జస్టిస్ చంద్ర ఘోస్ నేతృత్వంలోని కమిషన్ విచారణ చేస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు సమస్యలతో ఈ ప్రాజెక్ట్పై గత కొంతకాలంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఈటల రాజేందర్లకు కూడా నోటీసులు జారీ అయ్యాయి.
కమిషన్ ఇచ్చిన నోటీసులపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని రాజకీయ కుట్రగా భావిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజల జీవనాడి అని దీనిపై రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read : Shreyas Iyer : 18 ఏళ్ల తర్వాత పంజాబ్ ను ఫైనల్స్ కి తీసుకెళ్లిన కెప్టెన్