BJP West Bengal : కమ‌లం వ‌ద్దు టీఎంసీ ముద్దు

పార్టీని వీడుతున్న కీల‌క నేత‌లు

BJP West Bengal : దేశ వ్యాప్తంగా ఒకే దేశం ఒకే భాష ఒకే పార్టీ నినాదంతో విస్త‌రించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి  కోలుకోలేని

షాక్ త‌గులుతోంది ప‌శ్చిమ బెంగాల్(BJP West Bengal) రాష్ట్రం విష‌యంలో.

మోదీ త్ర‌యం మోదీ, అమిత్ షా, జేపీ న‌డ్డా తో ప‌లువురు కీల‌క నేత‌లు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు నానా హంగామా చేశారు ప‌శ్చిమ బెంగాల్ లో.

కానీ ఊహించ‌ని రీతిలో గ‌తంలో కంటే ఎక్కువ సీట్ల‌ను సంపాదించి త‌న‌కు ఎదురే లేద‌ని చాటింది టీఎంసీ చీఫ్ , ప్ర‌స్తుత సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ.

ఆమె కొట్టిన దెబ్బ‌కు ఒక్క‌సారిగా షాక్ కు గుర‌య్యారు. ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా, ఇంకెంత‌గా కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌తో దాడులు, కేసులు న‌మోదు చేసినా, భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసినా టీఎంసీ చెక్కు చెద‌ర‌లేదు.

చాలా మంది అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో టీఎంసీ నుంచి వీడి భార‌తీయ జ‌న‌తా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కానీ ప‌వ‌ర్ లోకి రాక పోవ‌డంతో తిరిగి త‌మకు జీవితాన్ని ఇచ్చిన టీఎంసీ వైపు మొగ్గు చూపారు.

ఇప్ప‌టికే కీల‌క‌మైన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా టీఎంసీ బాట ప‌ట్టారు. తాజాగా భార‌తీయ జ‌న‌తా పార్టీకి  చెందిన ఎంపీ అర్జున్ సింగ్ త‌న‌ను ప‌ట్టించు కోవ‌డం లేదంటూ గుడ్ బై చెప్పారు.

ఆ వెంట‌నే ఆయ‌న మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ స‌మ‌క్షంలో తిరిగి టీఎంసీ గూటికి చేరారు. ఇంకా చాలా మంది మేడం

దీదీ వైపు చూస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

తాజాగా జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో సైతం టీఎంసీ స‌త్తా చాటింది. ఆ పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు, ఆధిప‌త్య ధోర‌ణితో వేగ‌లేక టీఎంసీ నుంచి

వీడిన వారంతా తిరిగి చేరేందుకు రెడీ అయ్యారు.

దీంతో బీజేపీ(BJP West Bengal)  ప‌రిస్థితి మ‌రింత ఇబ్బందిని ఎదుర్కొంటోంది. సోష‌ల్ మీడియాలో బీజేపీ స‌క్సెస్ అయినా

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డంలో బీజేపీ ఫోక‌స్ పెట్ట‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి.

అవినీతి, అక్ర‌మాల‌కు అడ్డే లేకుండా పోయింద‌న్నారు గుడ్ బై చెప్పిన అర్జున్ సింగ్. బెంగాల్ ప్ర‌జ‌ల‌ను ఇప్ప‌టికీ అర్థం చేసుకోవ‌డంలో బీజేపీ విఫ‌ల‌మైంద‌న్న వాస్త‌వం గుర్తించాల‌న్నారు.

Also Read : ఆర్థిక సంక్షోభం అంచున భార‌త్

Leave A Reply

Your Email Id will not be published!