WPL Opening Ceremony : డ‌బ్ల్యూపీఎల్ లో తార‌ల సంద‌డి

వినోదాల హ‌రివిల్లుకు వేళాయే

WPL Opening Ceremony : ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్న సంబురం రానే వ‌చ్చింది. మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్) రిచ్ లీగ్ మార్చి 4 నుంచి 26 వ‌ర‌కు కొన‌సాగుతుంది. ఇప్ప‌టికే జ‌ట్లు త‌ల‌ప‌డేందుకు సిద్ద‌మ‌య్యాయి. ప్ర‌పంచ క్రికెట్ లో తొలిసారిగా బీసీసీఐ నిర్వహిస్తోంది. ఇప్ప‌టికే కోట్లాది రూపాయ‌ల ఆదాయం స‌మ‌కూరింది.

భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది క్రీడా సంస్థ‌. శ‌నివారం బెన్ మూత్ సార‌థ్యంలోని గుజ‌రాత్ జెయింట్స్ జ‌ట్టు హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ టీమ్ తో తొలి మ్యాచ్ లో త‌ల‌ప‌డ‌నున్నాయి. అంత‌కంటే ముందు భారీ ఎత్తున వినోదం పంచేందుకు ముంబై తార‌లు, సింగ‌ర్స్ రెడీ అయ్యారు(WPL Opening Ceremony). క్రికెట్ ఫ్యాన్స్ ను అల‌రించ‌నున్నారు.

ఇందులో ప్ర‌ముఖ న‌టీమ‌ణులు కియారా అద్వానీ , కృతి స‌న‌న్ తో పాటు రాప‌ర్ ఏపీ థిల్లాన్ ప్రారంభ వేడుక‌ల్లో ప్ర‌ద‌ర్శించ‌నున్నారు. ప్రారంభ మ్యాచ్ కు డీవై పాటిల్ ఆతిథ్యం ఇవ్వ‌నుంది. పంజాబీ కెన‌డియ‌న్ రాప‌ర్ గా పేరొందారు థిల్లాన్. మ‌హిళా ప్రీమియ‌ర్ రిచ్ లీగ్ లో ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డం త‌న‌కు ఎంతో సంతోషం క‌లిగిస్తోంద‌ని పేర్కొన్నారు కియారా అద్వానీ. డియ‌ర్ క్రికెట్ ఫ్యాన్స్ అంద‌రిని క‌లిసేందు కోసం ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నాన‌ని తెలిపారు.

ఇప్ప‌టికే బుక్ మై షో ద్వారా ఏర్పాటు చేసిన టికెట్ల‌న్నీ పూర్తిగా అమ్ముడు పోయాయి. ఇలా కూడా బీసీసీఐకి ఆదాయం స‌మ‌కూరుతోంది. బీసీసీఐ పెద్ద‌ల‌తో పాటు ఐసీసీకి సంబంధించిన బాధ్యులు కూడా తొలిసారి జ‌రిగే మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ కు హాజ‌రు కానున్నారు.

Also Read : గుజ‌రాత్ ముంబై బిగ్ ఫైట్

Leave A Reply

Your Email Id will not be published!