India T20 WI Tour : విండీస్ టి20 సీరీస్ కు కోహ్లీకి షాక్

18 మందితో బీసీసీఐ డిక్లేర్

India T20 WI Tour : బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ కోలుకోలేని షాక్ ఇచ్చింది స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీకి. గ‌త కొంత కాలంగా పేల‌వ‌మైన ఆట తీరుతో తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. అంతే కాదు మూడు ఏళ్ల‌లో ఒక్క సెంచ‌రీ కూడా న‌మోదు చేయ‌లేదు.

గాయం కార‌ణంగా ఇంగ్లండ్ టూర్ లో వ‌న్డేకు దూరంగా ఉన్నాడు. అంతా ఊహించిన‌ట్లుగానే కోహ్లీని(Virat Kohli) విండీస్ లో ప‌ర్య‌టించే టి20 జ‌ట్టు(India T20 WI Tour) లో ప‌క్క‌న పెట్టారు.

టీమిండియా స్టార్ పేస‌ర్ బుమ్రాను సైతం ఎంపిక చేయ‌లేదు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో ఆడాల్సి ఉంది. రెస్ట్ ఇచ్చారా లేక వేరే ఏదైనా కార‌ణ‌మ‌న్న‌ది ఇంకా వెల్ల‌డించ లేదు బీసీసీఐ.

కాగా పెద్ద ఎత్తున ఒత్తిడి వ‌ల్లే వీరిద్ద‌రినీ ప‌క్క‌న పెట్టాల్సి వ‌చ్చింద‌ని బీసీసీఐ తెలిపినా దాని వెనుక వేరే కార‌ణం ఉంద‌ని సీనియ‌ర్లు అంటున్నారు. వ‌న్డేల‌కు వెట‌ర‌న్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ఈనెల 22 నుంచి 27 దాకా వ‌న్డే సీరీస్ జ‌రుగుతుంది. 29 నుంచి జ‌రిగే టి20 ఫార్మాట్ కు మాత్రం రోహిత్ శ‌ర్మ‌కు అప్ప‌గించింది బాధ్య‌త‌ల్ని.

మ్యాచ్ ల ప‌రంగా చూస్తే మొద‌టి టి20 జూలై 29న , రెండో టి20 మ్యాచ్ ఆగ‌స్టు 1, మూడో టి20 మ్యాచ్ ఆగ‌స్టు 2న , నాలుగో టి20 మ్యాచ్ ఆగ‌స్టు 6న , ఐదో టి20 మ్యాచ్ ఆగ‌స్టు 7న జ‌రుగుతుంది.

జ‌ట్టులో రోహిత్ శ‌ర్మ కెప్టెన్, ఇషాన్ కిష‌న్ , రాహుల్ , సూర్య కుమార్ , దీప‌క్ హూడా, అయ్య‌ర్, దినేశ్ కార్తీక్ , రిష‌బ్ పంత్ , హార్దిక్ పాండ్యా, ర‌వీంద్ర జ‌డేజా, అక్ష‌ర్ ప‌టేల్, ఆర్. అశ్విన్ , ర‌వి బిష్ణోయ్ , కుల్దీప్ యాద‌వ్ , భువీ, అవేష్ ఖాన్ , హ‌ర్ష‌ల్ ప‌టేల్ , అర్ష్ దీప్ సింగ్ ఉన్నారు.

Also Read : ఇండియా జోర్దార్ ఇంగ్లండ్ బేజార్

Leave A Reply

Your Email Id will not be published!