Komatireddy Venkat Reddy : కోమ‌టిరెడ్డి కామెంట్స్ క‌ల‌క‌లం

ఓడిపోయే సీటుకు ప్ర‌చారం ఎందుకు

Komatireddy Venkat Reddy :మునుగోడులో రాజ‌కీయం మ‌రింత జోరందుకుంది. న‌వంబ‌ర్ 3న ఎన్నిక‌లు జ‌ర‌గనున్నాయి. ఇక్క‌డ ఎమ్మెల్యేగా ఉన్న కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేయ‌డంతో ఉప ఎన్నిక అనివార్య‌మైంది. అధికారంలో టీఆర్ఎస్ తో పాటు బీజేపీ, కాంగ్రెస్ బ‌రిలో ఉన్నాయి. బ‌రిలో ఎంద‌రో ఉన్నా ప్ర‌ధానంగా త్రిముఖ పోరు కొన‌సాగుతోంది.

దీంతో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య ఇప్పుడు కొత్త చిక్కు వ‌చ్చి ప‌డింది. అన్న‌నేమో ఎంపీ సోద‌రుడేమో బీజేపీ నుంచి బ‌రిలో ఉండ‌డం ఇబ్బందిక‌రంగా మారింది. ఒక‌రు కాంగ్రెస్ వైపు ఉండ‌గా మ‌రొక‌రు కాషాయం వైపు నిల‌బ‌డ్డారు. దివంగ‌త పాల్వాయి గోవ‌ర్ద‌న్ రెడ్డి కూతురు పాల్వాయి స్ర‌వంతి రెడ్డి ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప్ర‌చారంలో బిజీగా ఉన్నారు.

కాగా ఇక్క‌డ పార్టీ వైపు ప్ర‌చారం చేయ‌లేక మ‌రో వైపు సోద‌రుడు రాజ‌గోపాల్ రెడ్డి వైపు ఉండ‌లేక స‌త‌మ‌తం అయ్యారు ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. తాజాగా ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. మునుగోడులో ఓడి పోయే సీటుకు ప్ర‌చారం ఎందుకు చేయాలంటూ పేర్కొన్నారు.

త‌న త‌మ్ముడు గెల‌వ‌డం ఖాయ‌మ‌న్నారు. ఆస్ట్రేలియా టూర్ లో ఉన్న వెంక‌ట్ రెడ్డి(Komatireddy Venkat Reddy)  త‌న‌ను క‌లిసిన వారితో ముచ్చ‌టించారు. ఆర్థికంగా పార్టీ చాలా బ‌ల‌హీనంగా ఉంద‌న్నారు. తాను వెళితే డ‌బ్బులు ఎవ‌రు పెట్టాలో చెప్పాల‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేప‌ట్టాల‌ని అనుకున్నా. కానీ ఒక్కోరిది ఒక్కో గ్రూప్. ఒక‌రంటే ఇంకొక‌రికి ప‌డ‌దన్నారు.

ప్ర‌స్తుతం కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Also Read : దేశంలో కొత్త‌గా 2,112 క‌రోనా కేసులు

Leave A Reply

Your Email Id will not be published!