Ladakh Tank Accident : లడఖ్ లో నది దాటుతుండగా ప్రమాదవశాత్తు ఐదుగురు జవాన్ల మృతి

దౌలత్ బేగ్ ఓల్డి ప్రాంతంలోని నదిలో ఆర్మీ సైనికులు ట్యాంక్ క్రాసింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు...

Ladakh Tank Accident : కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శిక్షణ కార్యక్రమంలో భాగంగా ట్యాంక్ నదిని దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. లడఖ్‌(Ladakh)లోని నియంత్రణ రేఖ సమీపంలో నదిని దాటుతుండగా ట్యాంక్ ప్రమాదంలో ఐదుగురు సైనికులు మరణించారు. టి-72 ట్యాంక్ మందిర్ మోర్ నదిని దాటుతుండగా ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయిందని అధికారులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున దౌలత్ బేగ్ ఓల్డి ప్రాంతంలో భారత సైనికులు జరిపిన విన్యాసాల్లో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ట్యాంక్ నదిని దాటుతుండగా ఒక్కసారిగా నీటిమట్టం పెరిగింది. దీంతో ఐదుగురు జవాన్లు కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. రక్షణ మంత్రిత్వ శాఖ మూలం ప్రకారం, చనిపోయిన వారిలో నాన్-కమిషన్డ్ అధికారి ఉన్నారు.

Ladakh Tank Accident Viral

దౌలత్ బేగ్ ఓల్డి ప్రాంతంలోని నదిలో ఆర్మీ సైనికులు ట్యాంక్ క్రాసింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో నదిలో ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో ట్యాంక్‌ మునిగిపోయింది. రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ఎంత వెల్లడించారు? లడఖ్‌లోని ఎల్‌ఏసీ సమీపంలో వరదల కారణంగా ఐదుగురు ఆర్మీ జవాన్లు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. నీటి నుంచి ఇప్పటి వరకు పలు మృతదేహాలను వెలికి తీశారు. ప్రస్తుతం అన్వేషణ జరుగుతోంది.

Also Read : Dharmapuri Srinivas : ఉమ్మడి రాష్ట్ర పీసీసీ మాజీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ మృతి

Leave A Reply

Your Email Id will not be published!