Reena Rai : సిద్దు నువ్వు లేని జీవితం వ్య‌ర్థం

బ‌తికున్నా నేను చ‌ని పోయిన‌ట్లే

Reena Rai  : పంజాబ్ కు చెందిన దీప్ సిద్దు రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు. అత‌డు న‌టుడు. అంత‌కు మించి ఎక్కువ‌గా వివాదాస్ప‌దంగా మారాడు. రైతుల ఆందోళ‌న స‌మ‌యంలో రిప‌బ్లిక్ దినోత్స‌వం రోజున త‌ను ఎర్ర‌కోట‌పై జెండా ఎగుర వేశాడు.

అత‌డిపై కేసు న‌మోదైంది. స‌న్నీ డియోల్ తో పాటు ప్ర‌ధాని మోదీతో దిగిన ఫోటోలు వైర‌ల్ గా మారాయి. రెండు సార్లు అరెస్ట్ అయ్యాడు. బెయిల్ పై వ‌చ్చాడు. ఢిల్లీ నుంచి పంజాబ్ కు వెళుతుండ‌గా రోడ్డు ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు.

ఈ త‌రుణంలో త‌న‌తో పాటు ప్ర‌యాణం చేస్తూ వ‌చ్చిన న‌టి, ప్రియురాలు రీనా రాయ్(Reena Rai )స్పందించింది. హృద‌య విదార‌కంగా రాసింది. ఇన్ స్టా స్టోరీలో భావోద్వేగంతో పంచుకుంది. ఏం చెప్పాలో తెలియ‌డం లేదు.

జీవితం నిస్సారంగా అనిపిస్తోంది. వ్య‌క్తిగ‌తంగా ఎంతో చైత‌న్య‌వంతంంగా ఉండేవాడు దీప్ సిద్దూ. సిద్దు లేడంటే న‌మ్మ‌లేక పోతున్నా. నాకే వింత‌గా ఉంది ఆశ్చ‌ర్యం వేసింది. నా హృద‌యం, మ‌న‌స్సు నుంచి అత‌ను ఎప్పుడూ వేరు కాలేడు.

అంత‌గా మేం లీన‌మై ప్రేమికులై పోయాం. కానీ మ‌మ్మ‌ల్ని విధి విడ‌దీసింది. 2018 లో రంగ్ మూవీలో క‌లిసి న‌టించాం. ఏ జీవిత కాలంలోనూ విడిచి పెట్ట‌రంటూ నాకు ఇచ్చిన వాగ్ధానం గుర్తుకు వ‌స్తోంది.

నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తూనే ఉంటానని రాయ్ పేర్కొంది. సిద్దు నువ్వే నా గుండె చ‌ప్పుడు. ఇదిలా ఉండ‌గా ఆస్ప‌త్రిలో ఉంటూ రీనా రాయ్ పంచుకున్న ఫోటో నెట్టింట్లో వైర‌ల్ గా మారింది.

Also Read : సంగీత దిగ్గ‌జం కోల్పోవ‌డం బాధాక‌రం

Leave A Reply

Your Email Id will not be published!